కప్పుడు తెలుగు తెరను ఒక ఊపు ఊపిన తారలు రంభ,కుష్బు. తమ గ్లామర్ తో టాలీవుడ్ ను ఉర్రూతలూగించిన ఈ ఇద్దరు స్టార్స్.. చాలా కాలం తరువాత కలిసి సందడి చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇంతకీ ఎక్కడా...ఎందుకు కలిసారు.
తెలుగు, తమిళ సినిమాల్లో ఒక దశాబ్ధం పాటు మహరాణులుగా వెలుగు వెలిగారు హీరోయిన్లు రంభ, కుష్బు. అప్పటి తారల్లో టాప్ ప్లేస్లో ఉన్న వీరు. తరువాత తరువాత తెరకు దూరం అయ్యారు. ఇక ఈ ఇద్దరిలో ఖుష్బూ మాత్రం ఇంకా నటిస్తూనే ఉంది. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. ఇండస్ట్రీలోసందడి చేస్తుంది. కాని రంభ మాత్రం ఫ్యామిలీ లైఫ్తో బిజీగా అయిపోయింది. పెళ్ళి పిల్లలు, కుటుంభ బాధ్యతలను చూసుకుంటూ ఉండిపోయింది.
ఇక ఈ ఇద్దరు అందాలతారలు మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలుసు. మరి ఈ ఇద్దరు ఒక్క చోట చేరితో ఎలా ఉంటుంది. అంతా సందడి సందడిగా ఉంటుంది. సీనియర్ నటి అయినా... కుష్బు ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా వీరిద్దరు సందడి చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు.. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ వీరిద్దరు కలవడానికి కారణం ఏంటీ అంటే.. ? ఎప్పటి నుంచో మంచి స్నేహితులుగా ఉన్న వీరు.. చాలా కాలం తరువాత కలిశారు. అదే స్పెషల్.
రంభ పెళ్లయిన తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. ఈ బ్యూటీ సినిమాల్లో కనిపించక చాలా కాలమే అవుతుంది. ఫారెన్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా చెన్నైకి వచ్చిందట.దాంతో తన చిరకాల స్నేహితురాలిని కలవడానికి చెన్నైలోని రంభ ఇంటికి వెళ్లింది ఖుష్బూ. అక్కడ సందడి సందడి చేసింది. పాత గురుతులను నెమరువేసుకోండంతోపాటు.. అప్పటి అల్లరి వేశాలు గుర్తు తెచ్చుకుని.. హడావిడి చేసింది. అంతే కాదు వారికి ఇష్టమైన బిర్యానీ టేస్ట్ కూడా చూశారట తారలు.
ఇక ఈ ఇద్దరు మాజీ హీరోయిన్లు కలవక కలవక కలిశారు కదా.. ఇదే టైమ్ కాబట్టి.. తమ పాత జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. రంభతో దిగిన సెల్ఫీని, ఆమె పిల్లలు, ఇతర కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను కుష్బు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో మెరిసింది ఖుష్బూ. మరికొన్నిసినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక రంభ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఆమె అనౌన్స్ మెంట్ ఇస్తుందని చూస్తున్నారు. ప్రస్తుతానికి రంభ రీ ఎంట్రీ సస్పెన్స్ గా మారింది.