కత్తి మహేష్ భౌతికకాయానికి నేడు(ఆదివారం) ఆయన స్వగ్రామమైని చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన బంధువులు తెలిపారు.
ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేష్ శనివారం సాయంత్రం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత నెల జూన్ 26న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పరిస్థితి సీరియస్గా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఏపీ ప్రభుత్వం రూ.17లక్షల ఆర్థిక సాయం అందజేసింది. అయిన లాభం లేకపోయింది. దాదాపు 14 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కత్తి మహేష్ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమతోపాటు సినీ మీడియా సైతం సంతాపం తెలియజేసింది.
ఇదిలా ఉంటే కత్తి మహేష్ భౌతికకాయానికి నేడు(ఆదివారం) ఆయన స్వగ్రామమైని చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమందలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన బంధువులు తెలిపారు. కత్తి మహేష్కి భార్య సోనాలితోపాటు ఓ కుమారుడున్నారు. కత్తి మహేష్ `హృదయం కాలేయం`, `కొబ్బరిమట్ట`,`క్రాక్` వంటి చిత్రాల్లో నటించగా, `పెసరట్టు` చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శలెదుర్కొన్నాడు. `బిగ్బాస్`షోతో మరింత గుర్తింపుని తెచ్చుకున్నారు.