కంగనా తిరిగి ముంబయి నుంచి వెళ్ళిపోతుందట

Published : Sep 10, 2020, 12:42 PM IST
కంగనా తిరిగి ముంబయి నుంచి వెళ్ళిపోతుందట

సారాంశం

ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. శివసేన నాయకుల నుంచి తనకు హాని ఉందని ఇప్పటికే కంగనా వరుస ట్వీట్లు చేసింది. 

కంగనా రనౌత్‌ వివాదం ఇప్పుడు బాలీవుడ్‌నే కాదు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్‌ చేస్తుంది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి, కంగనాకి మధ్య ఓ యుద్ధమే జరుగుతుంది. శివసేన నాయకుల నుంచి తనకు హాని ఉందని ఇప్పటికే కంగనా వరుస ట్వీట్లు చేసింది. దీంతో ఆమె కోరిక మేరకు `వై ప్లస్‌` కేటగిరి భద్రతని కల్పించింది కేంద్ర హోంశాఖ. 

మరోవైపు ముంబయి పోలీసులపై విరుచుకుపడింది. తనకు ముంబయి  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లా కనిపిస్తుందని, సంచలన ఆరోపణలు చేశారు. దీంతో శివసేన ఎంపి సంజయ్‌ రౌత్‌వంటి పలువురు ఆమెపై విమర్శలు గుప్పించడంతోపాటు బెదిరింపులకు దిగారు. వారికి ప్రతి సవాల్‌ చేస్తూ `ముంబయి వస్తోన్న దమ్ముంటే నన్ను ఆపండి` అని కంగనా వెల్లడించింది.

అన్నట్టుగా ఆమె బుధవారం ముంబయి వచ్చారు. కరోనా నిబంధనల్లో భాగంగా ఆమెని 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ముంబయికి చెందిన బ్రిహన్‌ ముంబై పున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు వెల్లడించారు. కానీ కంగనా దీనిపై స్పందిస్తూ, వారం రోజుల కంటే తక్కువ రోజుల్లోనే ముంబయి నుంచి వెళ్ళిపోతానని ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోగా, ఆమెకి షార్ట్ టర్మ్ విజిటర్‌ కేటగిరీ కింద క్వారంటైన్‌ వెసులుబాటుని కల్పించారు. దీని ప్రకాకం కంగన ఈ నెల 14న ముంబయి నుంచి తిరిగి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటున్నారు.

మరోవైపు ఆమె బుధవారం ముంబయి వచ్చే లోపే ఆమె నివాసం ఉండే బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ అధికారులు కూల్చివేతలకు పాల్పడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా హై కోర్ట్ ని ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. దీంతో కూల్చివేతలను నిలిపివేశారు. దీనిపై కంగనా స్పందిస్తూ, యాజమాని లేకుండా ఎలా కూల్చివేతలకు పాల్పడతారు, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని ప్రశ్నించారు. కంగనా పిటిషన్‌ని నేడు కోర్ట్ విచారించనుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌