ఇలాంటి సినిమా చేయడానికి సిగ్గు లేదా..? కియారాపై కంగనా సోదరి ఫైర్!

By AN TeluguFirst Published May 27, 2019, 2:37 PM IST
Highlights

బాలీవుడ్ బ్యూటీ కియారా తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' వంటి చిత్రాల్లో నటించింది. 

బాలీవుడ్ బ్యూటీ కియారా తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ 'ఇందూ కీ జవానీ' అనే సినిమాలో నటిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ సినిమాలో కియారా డేటింగ్ యాప్స్ లో కనిపించే అబ్బాయిల ప్రోఫైల్స్ చూసి నచ్చినవారిని ఎంపిక చేసుకొని డేటింగ్ చేయాలనుకుంటుంది.

దీని వలన ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ విషయాన్ని కియారా ట్విట్టర్ వేదికగా ప్రకటించిన వెంటనే నటి కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు.

''ఎవరైనా 'ఇందూ కీ జవానీ' అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తారా..? ఓ పక్క మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోపక్క వారిని ఆట బొమ్మలుగా చూపిస్తున్నారు'' అంటూ మండిపడింది. ఒకవేళ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అంగీకరిస్తే అది ఆడవారికే అవమానకరమని అన్నారు. మన భావితరాలు తలదించుకునే రోజులు వస్తాయని, ఇలాంటి  సినిమాలు తీయడానికి బాలీవుడ్ కి సిగ్గు లేదా..?  అంటూ ఫైర్ అయింది. 

ఈ రకమైన సినిమాలు తీసే దర్శక, నిర్మాతలు తమ కుమార్తెల కళ్లల్లోకి చూడగలరా..? సిగ్గు చేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై కియారా ఇంకా స్పందించలేదు.  
 

click me!