ప్రభాస్ తో కంగనా గొడవేంటి..?

By Udayavani DhuliFirst Published Oct 19, 2018, 10:16 AM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు తెలియని వారుండరు. అంతగా ఆమె పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలంటే కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పేరు తెలియని వారుండరు. అంతగా ఆమె పాపులారిటీ దక్కించుకుంది. సినిమాలంటే కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కంగనా కెరీర్ తొలినాళ్లలో దర్శకుడు పూరి జగన్నాథ్ 'ఏక్ నిరంజన్' సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ప్రభాస్ హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదలయ్యి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తవుతుంది. ఆ తరువాత కంగనా తెలుగు సినిమాలలో కనిపించలేదు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

మరోపక్క ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో కంగనా వద్ద ప్రభాస్ టాపిక్ తీసుకురాగా.. 'ఏక్ నిరంజన్' సినిమా నుండే ప్రభాస్ తో మాట్లాడడం మానేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. 'ఏక్ నిరంజన్' సినిమా సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. దాని కారణంగానే అప్పటినుండి ఇద్దరం మాట్లాడుకోవడం మానేశామని చెప్పుకొచ్చింది.

అయితే 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ నటన చూసి గర్వంగా ఫీల్ అయ్యానని, 'మణికర్ణిక' సినిమాలో తన నటన చూసి కూడా ప్రభాస్ గర్వంగా ఫీల్ అవుతాడంటూ తన పాత్ర గొప్పదనం గురించి తెలిపింది. అయితే ప్రభాస్ తో ఎందుకు గొడవ జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు ఈ బ్యూటీ. 

click me!