భారతీయ సినిమా ఆ నలుగురి సొత్తు కాదు.. కంగనా ఫైర్‌.. `జల్లికట్టు`కి అభినందనలు

By Aithagoni RajuFirst Published Nov 26, 2020, 4:30 PM IST
Highlights

 మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే.

సమయం చిక్కినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా బాలీవుడ్‌పై మండిపడుతుంది కంగనా రనౌత్. అందుకే బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరుతెచ్చుకుంది. తాజాగా మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే. 93వ అకాడమీ పురస్కారాల పోటీకి ఈ సినిమాని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా `జల్లికట్టు` చిత్ర బృందానికి కంగనా అభినందనలు తెలిపింది. 

కంగనా ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, `అందరిపై అధికారం చలాయించాలని చూసే బుల్లీడావుద్‌ గ్యాంగ్‌కి సరైన శాస్తి జరిగింది. భారతీయ చిత్ర పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాలకు చెందినది కాదుని నిరూపితమైంది. సినిమా మాఫియా గ్యాంగ్‌ ఇళ్లలోనే దాక్కొండి, జ్యూరీ తన విధిని పక్కాగా నిర్వర్తిస్తోంది. `జల్లికట్టు` టీమ్‌కి నా అభినందనలు` అని పేర్కొంది కంగనా. పరోక్షంగా బాలీవుడ్‌ టాప్‌ హీరోలను విమర్శించింది.

All the scrutiny/ bashing Bullydawood gang got is finally yielding some results, Indian films aren’t just about 4 film families, movie mafia gang is hiding in their houses and letting juries do their job and congratulations team https://t.co/kI9sY4BumE

— Kangana Ranaut (@KanganaTeam)

ఇటీవల సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య సమయంలో బాలీవుడ్‌లో నెపోటిజంపై, అలాగే డ్రగ్స్ మాఫియాపై కంగనా ఫైర్‌ అయ్యింది. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏకంగా ఆమె చిన్నపాటి యుద్దమే చేసింది. ఇక కంగనా ప్రస్తుతం జయలలిత బయోపిక్‌ `తలైవి`లో, అలాగే `దాఖడ్‌` చిత్రాల్లో నటిస్తుంది.

click me!