
స్టార్ హీరోయిన్ కాజల్ కి అరుదైన వీసా లభించింది. యూఏఈ దేశానికి చెందిన గోల్డెన్ వీసా కాజల్ పొందడం విశేషం. ఈ విషయాన్ని కాజల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన సంతోషాన్ని పంచుకుంది. యూఏఈలో ఉండేందుకు కాజల్కి ఈ వీసా లభించడం విశేషం. యూఏఈ బేస్డ్ జుమా అల్మ్ హిరీ బిజినెస్ కన్సల్టేషన్ సంస్థ ద్వారా ఈ గోల్డెన్ వీసాని పొందింది కాజల్. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధి మహమద్ షానిద్ అసిఫలి చేతుల మీదుగా కాజల్ ఈవీసాని అందుకుంది. తన సంతోషాన్ని పంచుకుంది.
ఇందులో కాజల్ చెబుతూ, యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనలాంటి కళాకారులకు యూఏఈ దేశం ఎప్పుడూ ఎంతో ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా యూఏఈకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ దేశంతో మున్ముందు కలిసి పనిచేయాలని, భవిష్యత్ సహకారాల కోసం ఎదురుచూస్తున్నా` అని పేర్కొంది కాజల్. ఈ సందర్భంగా జుమా అల్మ్ హిరీ సంస్థ ప్రతినిధి మహమ్మద్ షానిద్కి, సురేష్ పున్నసెరిల్, నరేష్ క్రిష్టలకు కృతజ్ఞతలు తెలిపింది కాజల్.
ఇక కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉన్నారు. కాజల్ ప్రెగ్నెంట్ అయినట్టు ఆమె భర్త గౌతమ్ కిచ్లు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. బేబీ బంప్స్ తో కాజల్ సైతం ఫోటోలకు పోజులిచ్చి అభిమానులను అలరించింది. ఆ తర్వాత కూడా తన గ్లామర్ పిక్స్ తో అలరిస్తుంది. మరోవైపు ఇటీవల ఆమె వెకేషన్లో ఎంజాయ్ చేసిన విసయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె పంచుకున్న పిక్ ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
కెరీర్ పరంగా కాజల్ మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ అవుతూ వచ్చారు. తమిళంలో `హే సినామికా`, తెలుగులో `ఆచార్య` చిత్రాలు చేశారు. దీంతోపాటు నాగార్జునతో `ది ఘోస్ట్` చిత్రానికి కూడా కమిట్ కాగా, ఇటీవల తాను ప్రెగ్నెంట్ కావడంతో ఆ చిత్రం నుంచి తప్పుకుంది. మరోవైపు ఇప్పటికే ఆమె తమిళంలో `కరుంగాపియమ్`, `ఘోస్టీ`, హిందీలో `ఉమా` చిత్రాలు పూర్తి చేసుకుంది.