కాజల్ కంటిచూపుపై మొబైల్ ఎఫెక్ట్!

By Udayavani DhuliFirst Published Dec 28, 2018, 3:09 PM IST
Highlights

పలు చిత్రాల్లో నటించిన కోలివుడ్ తార కాజల్ పశుపతి 'బిగ్ బాస్' సీజన్ 1తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ఆమె దర్శకుడు సుందర్ తెరకెక్కించిన 'కలకలప్పు2' సినిమా కనిపించింది. 

పలు చిత్రాల్లో నటించిన కోలివుడ్ తార కాజల్ పశుపతి 'బిగ్ బాస్' సీజన్ 1తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిగా ఆమె దర్శకుడు సుందర్ తెరకెక్కించిన 'కలకలప్పు2' సినిమా కనిపించింది.

సినిమాల్లో బిజీగా ఉన్నా.. ఈ నటి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అటువంటిది కొద్దిరోజులుగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టడం, అభిమానులకు రిప్లయ్ ఇవ్వడం తగ్గించేసింది.

ఇదే విషయాన్ని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఎక్కువగా ఆడడం వలన కంటిచూపు దెబ్బతిందని, సెల్ ఫోన్ ను చేతుల్లో కూడా పెట్టుకోవద్దని డాక్టర్ వార్నింగ్ ఇచ్చారని, ఆ కారణం చేతనే ట్విట్టర్ లో యాక్టివ్ గా లేనని కాజల్ చెప్పింది.

మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం వలన వచ్చే ఇబ్బందులను తను స్వయంగా అనుభవిస్తున్నానని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె వెల్లడించింది. 

click me!