డైరెక్ట్ చేయాలనుకుంటే.. హీరోయిన్ చనిపోయింది!

Published : Jun 30, 2018, 04:21 PM ISTUpdated : Jun 30, 2018, 04:23 PM IST
డైరెక్ట్ చేయాలనుకుంటే.. హీరోయిన్ చనిపోయింది!

సారాంశం

ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన కె.ఎస్.రామారావు ఇప్పుడు బాగా స్లో అయిపోయారు

ఒకప్పుడు అగ్ర నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసిన కె.ఎస్.రామారావు ఇప్పుడు బాగా స్లో అయిపోయారు. ప్రస్తుతం ఆయన సాయి ధరం తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా జూలై 6న విడుదలకు సిద్ధమవుతోంది.

నిర్మాతగా దాదాపు 45 సినిమాలు చేసిన కె.ఎస్.రామారావు డైరెక్టర్ గా కూడా పని చేయాలని అనుకునేవారట. ఈ క్రమంలో ఓ కథ సిద్ధం చేసుకొని ప్రముఖ హీరోయిన్ కు వినిపించారట. దానికి ఆమె తన అన్నయ్యని అడిగి చెబుతానని.. దాదాపు సినిమా పట్టాలెక్కే సమయంలో ఆమె ఓ ప్రమాదంలో చనిపోయిందని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ హీరోయిన్ సౌందర్య అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె మాత్రమే తన అన్నయ్యని అడిగి సలహాలు  తీసుకునేదని సమాచారం. హెలీకాఫ్టర్ ప్రమాదంలో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఇక కె.ఎస్.రామారావు నిర్మాణ రంగంలో కాస్త స్పీడ్ పెంచాలని చూస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఈయన నిర్మాణంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి