John Abraham: బాలీవుడ్ రొమాంటిక్ హీరోకు కోవిడ్ పాజిటీవ్... ఫ్యామిలీతో సహా

By Mahesh JujjuriFirst Published Jan 3, 2022, 2:14 PM IST
Highlights

బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుతం థార్డ్ వేవ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో.. ఫిల్మ్ ఇండస్ట్రీపై కరోనా విజృంబిస్తోంది.

 ప్రపంచంపై కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. మన దేశాలో కూడా వేల సంఖ్యలో జనాలు కరోనా బారిన పడుతున్నారు. పేదా.. పెద్దా అని లేకుండా అందరిని పట్టి పీడుస్తున్న కరోనా మహమ్మారి.. ఫిల్మ్ ఇండస్ట్రీపై కూడా కోరలు చాచింది. కొద్ది రోజులుగా బాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతూనే ఉన్నారు తాజాగా జా అబ్రహం ఫ్యామిలీ కూడ కరోనా బారిన పడింది.

 

ఇప్పటికే కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, విక్రమ్, వడివేలు, బాలీవుడ్ స్టార్స్ అర్జున్ కపూర్ అండ్ ఫ్యామీలీ.. కరీనా కపూర్, నోరా ఫతేహి, టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ ఇలా చాలా మందిస్టార్స్ కరోనా బారిన పడి రీసెంట్ గా కోలుకున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్.. హ్యాండ్సమ్ హీరో జాన్ అబ్రహం.. ఆయన భార్య ప్రియా రుంచల్ ఇద్దరికి కరోనా పాజిటీవ్ గా నిర్ధార అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్ అబ్రహం సోషల్ మీడియాలో ప్రకటించారు.

 

కొద్ది రోజులు క్రితం తాను కలిసిన  ఓ వ్యక్తికి కరోనా పాజిటీవ్ వచ్చిందని. అనుమానంతో తాము కూడా టెస్ట్ చేయించుకోగా.. తనకు తన భార్యకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యిందంటూ జాన్ అబ్రహం తెలిపారు. తనను కలిసిన వారు తప్పకుండా కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం తమ పరిస్థితి బాగానే ఉందని. లైట్ గా కరోనా లక్షణాలు ఉన్నాయన్నారు. డాక్టర్లు సలహా మేరకు ఇంట్లోనే ఉంటూ ఐసోలేషన్ లో ఉన్నామన్నారు.ప్రతీ ఒక్కరు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈమధ్యనే తాను తన తన భార్య కరోనా వాక్సిన్ వేయించుకున్నామని.. అయినా సరే కరోనా  వచ్చిందన్నారు. తనను కలిసిన వారు వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లన్నారు జాన్.

Also Read : Vishal: యాక్షన్ ట్రీట్ ఇస్తానంటున్న విశాల్.. పాన్ ఇండియాను టార్గెట్ చేసిన కోలీవుడ్ స్టార్

click me!