మూడు ఎగ్జైటింగ్‌ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాః `జాతిరత్నాలు` ఫేమ్‌ నవీన్‌ పొలిశెట్టి

By Aithagoni RajuFirst Published Jul 3, 2021, 1:54 PM IST
Highlights

`జాతిరత్నాలు` సినిమా తర్వాత అఫీషియల్‌గా ఆయన ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు. ఆయన సినిమాలపై అనేక వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన నెక్ట్స్ సినిమాల గురించి వెల్లడించారు.

`ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు` చిత్రాలతో సక్సెస్‌ సాధించి క్రేజీ కమెడీ హీరోగా మారాడు నవీన్‌ పొలిశెట్టి. తనకంటూ ఓ స్పెషల్‌ జోనర్‌ ని ఏర్పాటు చేసుకున్నారు. సింపుల్‌ కథతో ఫన్‌ జనరేట్‌ చేసి రెండున్నర గంటలు థియేటర్లో నవ్వులు పూయించి సూపర్‌ సక్సెస్‌ అందుకున్నారు. ఇటీవల విడుదలైన `జాతిరత్నాలు` సినిమా దాదాపు యాభై కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే నవీన్‌ కామెడీకి ఏ రేంజ్‌లో మార్కెట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ సినిమా తర్వాత అఫీషియల్‌గా ఆయన ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు. ఆయన సినిమాలపై అనేక వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన నెక్ట్స్ సినిమాల గురించి వెల్లడించారు. తాను ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించబోతున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఆయా సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఇంకా ఏ వార్తలను నమ్మొద్దంటూ ఓ ఇంగ్లీష్‌ రైటర్‌ కోటేషన్‌ని పంచుకున్నాడు నవీన్‌. మూడు సినిమాలు మూడు బిగ్గెస్ట్ బ్యానర్స్ లో చేస్తున్నాడట. వాటిలో పనిచేయడం తన డ్రీమ్‌ లాంటిదని పేర్కొన్నాడు. చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పాడు. 

Thank you so much ❤️ Script work going on for the next three movies. Will be announcing them soon on my handle “Inkekkada yem chadivina nammakandi” - Albert Einstein . It’s been a dream to work with the biggest production houses. Super excited about what’s in store for you guys. https://t.co/V6hoYBWX8q

— Naveen Polishetty (@NaveenPolishety)

కానీ ఆ మూడు సినిమా వివరాలు చెప్పలేదు. అయితే వీటిలో యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో అనుష్క శర్మతో జోడీ కట్టబోతున్నాడట నవీన్‌ పొలిశెట్టి. అంతేకాదు ఇందులో విజయ్‌ దేవరకొండ ఎక్స్‌టెండెడ్‌ కోమియో చేస్తున్నట్టు సమాచారం. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.
 

click me!