తిరుమల శ్రీవారిపై అంత భక్తి కారణం ఇదే..ఎట్టకేలకు రివీల్ చేసిన జాన్వీ కపూర్, తల్లిని గుర్తు చేసుకుంటూ..

By tirumala ANFirst Published Mar 24, 2024, 4:12 PM IST
Highlights

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

జాన్వీ కపూర్ కి సిల్వర్ స్క్రీన్ పై పెద్దగా విజయాలు లేవు. కానీ గ్లామర్ తోనే ఆమె మిలియన్ల కొద్దీ అభిమానులని సొంతం చేసుకుంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదట శ్రీదేవి సౌత్ లో రాణించి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది. కాయాన్ని జాన్వీ కపూర్ మాత్రం బాలీవుడ్ కెరీర్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే సౌత్ లో పాన్ ఇండియా చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంటోంది. 

అయితే జాన్వీ కపూర్ ఇటీవల పదే పదే తిరుమలలో కనిపిస్తోంది. శ్రీవారిపై అంతులేని భక్తితో జాన్వీ కపూర్ వరుసగా తిరుమలని సందర్శిస్తోంది. వీలైనంత వరకు జాన్వీ కపూర్ కాలినడకన తిరుమలకు వెళుతోంది. ఇటీవల జాన్వీ కపూర్ తిరుమలకి వెళుతూ మెట్లని మోకాళ్ళతో ఎక్కుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. జాన్వీ కపూర్ కి ఇంత భక్తి ఏంటి అని అంతా అనుకున్నారు. 

అయితే తాజాగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిపై తనకున్న భక్తిని కారణాన్ని వివరించింది. మా అమ్మ శ్రీదేవి గారి వల్లే నాకు తిరుమలపై భక్తి ఇష్టం ఏర్పడ్డాయి. నేను చిన్నతనంలో ఉన్నప్పడే మా అమ్మ పలుమార్లు నన్ను తిరుమలకు తీసుకువచ్చిది. నాకు తిరుమలతో ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభందం ఉంది. ఇప్పటివరకు 50 సార్లు తిరుమలని సందర్శించాను. 

నేను తిరుమలకు వెళ్లిన ప్రతి సారీ నాకు ఏదో ఒక మంచి సంఘటన జరుగుతుంది అని జాన్వీ తెలిపింది. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ టాప్ ఫామ్ లో ఉంది. ఎన్టీఆర్ సరసన దేవర అనే పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మరో పాన్ ఇండియా ఛాన్స్ కొట్టేసింది. రాంచరణ్, బుచ్చిబాబు చిత్రంలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. 

click me!