అతిలోక సుందరిని తలచుకుని ఎమోషనలైన జాన్వీ కపూర్‌.. ప్రతిరోజు మిస్‌ అవుతున్నామంటోన్న ఖుషీ కపూర్‌

By Aithagoni RajuFirst Published Aug 13, 2021, 2:32 PM IST
Highlights

 శ్రీదేవిని తలచుకుని వాళ్లిద్దరు కూతుళ్లు ఎమోషనల్‌ అయ్యారు. పెద్ద కూతురు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, చిన్న కూతురు ఖుషీ కపూర్‌ అరుదైన చిత్రాలను పంచుకుని తమ బాధని వ్యక్తంచేశారు. అమ్మని ఎంతగా మిస్‌ అవుతున్నారో వెల్లడించారు. 

ఇండియన్‌ ఫస్ట్ లేడీ సూపర్‌ స్టార్‌, హీరోయిన్లకి స్టార్‌ హీరోలకు మించిన ఇమేజ్‌ని తీసుకొచ్చిన నటి శ్రీదేవి. అతిలోక సుందరిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిన శ్రీదేవిని తలచుకుని వాళ్లిద్దరు కూతుళ్లు ఎమోషనల్‌ అయ్యారు. పెద్ద కూతురు, హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, చిన్న కూతురు ఖుషీ కపూర్‌ అరుదైన చిత్రాలను పంచుకుని తమ బాధని వ్యక్తంచేశారు. అమ్మని ఎంతగా మిస్‌ అవుతున్నారో వెల్లడించారు. 

జాన్వీ కపూర్‌ అమ్మ శ్రీదేవితో ఉన్న తన చిన్ననాటి ఫోటోని ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేస్తూ, `హ్యాపీ బర్త్ డే ముమ్మా. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం. ప్రతి రోజు, ఎప్పటికీ మాకు నువ్వే అంతా.  ఐ లవ్యూ` అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్‌. ఈ పోస్ట్, ఆమె పంచుకున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

మరోవైపు జాన్వీ చెల్లి, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ స్పందిస్తూ, బోనీ కపూర్‌తో శ్రీదేవి ఉన్న ఫోటోని పంచుకుంది. తన ఇన్‌ స్టోరీస్‌లో తాను స్పందిస్తూ `ప్రతి రోజు మిస్‌ అవుతున్నా అమ్మా` అని పేర్కొంది. ఈ పిక్‌ సైతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది. 

1953,ఆగస్ట్ 13న మద్రాస్‌లో జన్మించిన శ్రీదేవి నాలుగేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి, తెలుగు, తమిళం,కన్నడ, హిందీ, మలయాళంలో మూడు వందలకుపైగా చిత్రాల్లో నటించి తిరుగులేని ఇమేజ్‌తో, స్టార్‌డమ్‌తో రాణించారు. భారతీయ సినిమా పరిశ్రమలో మొట్ట మొదటి ఫీమేల్‌ సూపర్‌స్టార్‌గా నిలిచారు. అందం, అంతకు మించిన అభినయం, అద్భుతమైన నటన, అంతకు మించిన సౌందర్యం శ్రీదేవి సొంతం. 

తెలుగులో నటించిన `జగదేక వీరుడు అతిలోక సుందరి` చిత్రంలోని `అతిలోక సుందరి` అనే ట్యాగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీదేవి మూడేళ్ల క్రితం దుబాయ్‌లో ఓ హోటల్‌లో ఫిబ్రవరి 24న అనుమానస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

click me!