సెట్‌లో ఈ-ఆటో నడిపించిన జాన్వీ కపూర్‌.. యూనిట్‌ షాక్‌

Published : Feb 11, 2021, 09:18 AM ISTUpdated : Feb 11, 2021, 09:25 AM IST
సెట్‌లో ఈ-ఆటో నడిపించిన జాన్వీ కపూర్‌.. యూనిట్‌ షాక్‌

సారాంశం

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పంజాబ్‌లో శరవేగంగా జరుగుతుంది. దీన్ని ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సెట్‌లో ఓ ఫన్నీ సీన్‌ చోటు చేసుకుంది. షూటింగ్‌ మధ్యలో జాన్వీ కపూర్‌ ఓ ఫన్నీ ఎపిసోడ్‌కి తెరలేపింది.   

అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్‌ షూటింగ్‌ సెట్‌లో చిల్‌ అయ్యింది. ఈ వీడియోని పంచుకుంటూ అభిమానులను చిల్‌ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం పంజాబ్‌లో శరవేగంగా జరుగుతుంది. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సెట్‌లో ఓ ఫన్నీ సీన్‌ చోటు చేసుకుంది. షూటింగ్‌ మధ్యలో జాన్వీ కపూర్‌ ఓ ఫన్నీ ఎపిసోడ్‌కి తెరలేపింది. 

ఈ-ఆటోని నడిపించింది. దాంట్లో యూనిట్‌కి చెందిన ఇద్దరిని కూర్చోబెట్టుకుని సరదాగా ఆ పరిసరాల్లో కలియ తిరిగింది. దీంతో చిత్ర యూనిట్‌ మొత్తం షాక్‌కి గురయ్యారు. దీంతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ స్టార్‌ కూతురు, క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున జాన్వీ కపూర్‌ ఇలా చేయడం అంతా అవాక్కవుతున్నారు. మొత్తానికి కాసేపు తాను చిల్‌ అవుతూ, యూనిట్‌ని చిల్‌ చేసిందని చెప్పొచ్చు. ఈ వీడియోని జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. `ఫిల్మ్ షూట్స్ సరదాగా ఉన్నాయి` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. 

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌ `దఢక్‌` చిత్రంతో హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత `గుంజన్‌ సక్సేనాః ది కార్గిల్‌ గర్ల్`తో మెప్పించింది.  ప్రస్తుతం `రూహి అప్జానా`, `దోస్తానా 2` చిత్రాలతోపాటు `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రంలో నటిస్తుంది. దీనికి సిద్ధార్థ్‌ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. గతంలో విజయ్‌ దేవరకొండ `లైగర్‌`లో నటించాల్సి ఉంది. కానీ సెట్‌ కాలేదు. ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ వినిపిస్తుంది. ఓ క్రియేటివ్‌ డైరెక్టర్‌ జాన్వీని లాంచ్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది