సందీప్ ఆ కథని వెబ్ సీరిస్ చేయటానికే ఫిక్స్?

By Surya PrakashFirst Published Dec 7, 2023, 9:28 AM IST
Highlights

సెన్సార్ నుంచి బయిటపడటం కష్టమనే అభిప్రాయంలో వెబ్ సీరిస్ చేద్దామని ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ మీడియా అంటోంది.


ఇప్పుడు ఎక్కడ చూసినా వెబ్ సీరిస్ లే నడుస్తున్నాయి. పెద్ద స్టార్స్, డైరక్టర్స్ సైతం వెబ్ సీరిస్ ల వైపే దృష్టి పెడుతున్నారు. అందులోనూ వెబ్ సీరిస్ లలో కావాల్సిన స్వెచ్చ ఉండటం, సెన్సార్ లేకపోవటంతో వెబ్ సీరిస్ లో తాము తెరపై చెప్పలేనివి చెప్పాలని ఫిక్స్ అవుతున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా సైతం ఓ వెబ్ సీరిస్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

సందీప్ వంగా తను విజయ్ దేవరకొండ తో చేసిన ‘అర్జున్ రెడ్డి’ త‌ర‌వాత ‘షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ’ అనే సినిమా తీద్దామ‌నుకొన్నాడు. వేశ్యావృత్తి, స్మ‌గ్లింగ్, డ్ర‌గ్స్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది అని తెలుస్తోంది.  ఈ కథని పూర్తి వాస్తవికంగా, హింస‌, ర‌క్త‌పాతం తీయాలనుకున్నారట. తను మొదట సినిమాగా దాన్నే ప్లాన్ చేసారట. అయితే  బోల్డ్ సీన్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. దాన్ని ప‌క్క‌న పెట్టి అర్జున్ రెడ్డి తీసారట. ఆ తర్వాత అదే కథను మహేష్ కు సైతం చెప్పారని అఫ్పట్లో వార్తలు వచ్చాయి. వాటి సంగతేమో కానీ ఇప్పుడు  `యానిమ‌ల్‌` తీశాడ‌ు. ఈ సినిమా సైతం అరాచకంగా ఉంది.  దాంతో షుగర్ ఫ్యాక్టరీ తీస్తే సెన్సార్ నుంచి బయిటపడటం కష్టమనే అభిప్రాయంలో వెబ్ సీరిస్ చేద్దామని ఫిక్స్ అయ్యారని బాలీవుడ్ మీడియా అంటోంది.

Latest Videos

ఇక యానిమ‌ల్‌ తో తను ఎలాంటి కంటెంట్ తీస్తే యాక్సెప్ట్ చేస్తారో పూర్తి క్లారిటీ వచ్చిందని..దాంతో ధైర్యంగా ‘షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ’ని పట్టాలు ఎక్కించవచ్చని ఫిక్స్ అయ్యారట.  ప్రత్యకంగా వెబ్ సిరీస్‌ తీయాలనుకోవటానికి కారణం సెన్సార్ గొడవలు ఉండ‌వు అనే తెలుస్తోంది.  ఇక సందీప్ వంగా నెక్ట్స్ స్పిరిట్ అని తెలుస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ ని పోలీస్ అధికారిగా చూపించబోతన్నారట. అందులోనూ హింస ఎక్కువగానే ఉంటుందని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు. 

click me!