'మహానటి' మనీ మైండెడా..? నిజం ఏమిటి?

By Udayavani DhuliFirst Published Jan 17, 2019, 1:49 PM IST
Highlights

తెలుగు తెరపైకి కీర్తి సురేష్ రావటమే ఓ సునామిలా వచ్చింది. తన హోమ్లీ లుక్ తో వరస ఆపర్స్ సంపాదించింది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్స్ వచ్చినా తట్టుకుని, మహానటి చిత్రంతో తనేంటో ప్రూవ్ చేసుకుంది. 

తెలుగు తెరపైకి కీర్తి సురేష్ రావటమే ఓ సునామిలా వచ్చింది. తన హోమ్లీ లుక్ తో వరస ఆపర్స్ సంపాదించింది. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్స్ వచ్చినా తట్టుకుని, మహానటి చిత్రంతో తనేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమెపై ఓ రూమర్ తమిళ, తెలుగు మీడియాలో ప్రయాణిస్తోంది. అది ఆమె పూర్తిగా మనీ మైండెడ్ గా వ్యవరిస్తూ తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో పడిందని.. అందుకు ఆమె కమిటవ్వతున్న ప్రాజెక్టులనే ఉదాహరణగా చూపెడుతున్నారు.

రజనీకాంత్ వంటి తన వయస్సు కన్నా ఎక్కువ ఉన్న స్టార్ సరసన కూడా ఆమె చేయటానికి సైన్ చేస్తోందని అంటున్నారు. ఆమె కు పేరు తెచ్చిపెట్టే పాత్రలు తీసుకువెల్తున్నా.. రెమ్యునేషన్ సరిపడా ఇవ్వటం లేదని ప్రక్కన పెట్టేస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందీ అంటే... కీర్తి సురేష్ ని తమ సినిమాలో తీసుకుందామనుకుని భంగపడిన వాళ్లే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆమె పాత్ర నచ్చాలి లేదా స్టార్ అయినా ఉండాలి అనే రూల్ పెట్టుకుందట. అంటే వ్రతం చెడినా ఫలితం దక్కాలి అన్నట్లు ...పాత్ర నచ్చి పేరు తెస్తుందంటే డబ్బుకు ప్రయారిటీ ఇవ్వదట.

అలా కాకుండా...స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే పేమెంట్స్ బాగుంటాయి..పబ్లిసిటీ బాగుంటుంది. కమర్షియల్ గా తన కెరీర్ కు, తన కు వర్కవుట్ అవుతుందని లెక్కలేసుకుని సినిమాలు ఓకే చేస్తోందట. అయితే ఈ క్రమంలో ఆమె ఈ రెండు దొరకవు అనుకున్న సినిమాలు ప్రక్కన పెట్టేస్తోంది. ఆ నిర్మాతలే ఆమెకు పొగరు..డబ్బు పిచ్చి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని సమాచారం. 

click me!