200 మంది డ్యాన్సర్లతో చిరంజీవి హంగామా.. సిల్వర్ స్క్రీన్ పై జాతరే..

By Asianet NewsFirst Published Feb 8, 2023, 5:39 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. మెగా ఫ్యాన్స్ ఈ చిత్రం ఫుల్ జోష్ ఇచ్చింది. ఆచార్య పరాజయం.. గాడ్ ఫాదర్ చిత్రం అంతంత మాత్రంగా రాణించడంతో మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. 

వారి ఆకలి తీర్చే విధంగా చిరు మాస్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నుంచి షూటింగ్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. 

ప్రస్తుతం దర్శకుడు మెహర్ రమేష్ 200 మంది డ్యాన్సర్లతో చిరంజీవిపై ఒక లావిష్ సాంగ్ ని షూట్ చేస్తున్నారట. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ఉండబోతోంది. సిల్వర్ స్క్రీన్ పై ఈ సాంగ్ విజువల్ ట్రీట్ లాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ ఇస్తున్నారు. 

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో ఆమె కూడా భాగం కానుందట. ఇక తమన్నా చిరంజీవికి జోడిగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. 

click me!