మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ లాంటి హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో కెరీర్ ని వరుణ్ తేజ్ తిరిగి గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా కాలంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ లాంటి హ్యాట్రిక్ ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో కెరీర్ ని వరుణ్ తేజ్ తిరిగి గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ 'మట్కా;' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రం పూర్తి కాకముందే వరుణ్ తేజ్ మరో రెండు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజకి టచ్ చేసి చూడు లాంటి డిజాస్టర్ చిత్రాన్ని ఇచ్చిన విక్రమ్ సిరికొండ అనే దర్శకుడికి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ దర్శకుడు ఏఐ నేపథ్యంలో అమెరికాలో జరిగే ఒక ప్రేమ కథని సిద్ధం చేసుకున్నారట. మోడ్రన్ అంశాలతో పాటు ఫీల్ గుడ్ అంశాలు ఉండేలా ఈ చిత్రం ఉండబోతోందట. వరుణ్ తేజ్ ఇంప్రెస్ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఐ నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ కాబట్టి సైబర్ క్రైమ్ లాంటి వ్యవహారాలు ఉంటాయోమో చూడాలి.
ఇక వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో దర్శకుడు మేర్లపాక గాంధీ అని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందట ముందుగా విక్రమ్ సిరికొండ చిత్రం.. ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలోని చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా వరుణ్ తేజ్కి అంతా ఫ్లాపు డైరెక్టర్లే దొరుకుతున్నారు.