
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అనిల్ తాజాగా తెరకెక్కించిన ఎఫ్3 చిత్రం నిన్ననే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. దీనితో అనిల్ రావిపూడి అండ్ టీం సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఎఫ్2 చిత్రం ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనితో ఎఫ్3 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలని ఏప్ అందుకున్నది ఫిలిం క్రిటిక్స్ అంటున్నారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ కామెడీతో అదరగొట్టేశారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా అనిల్ రావిపూడి ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్ 3 ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట.
ఎప్పటికైనా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి ఫాంటసీ చిత్రం తెరకెక్కించాలని ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. అలాగే అన్ని ఎమోషన్స్ ఉండే 'మాయాబజార్' లాంటి చరిత్రలో నిలిచిపోయే ఫ్యామిలీ స్టోరీ తెరకెక్కించాలని ఉన్నట్లు కూడా అనిల్ తెలిపారు.
దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమా చేయాలని అనుకున్నా. వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశా. బాలయ్య గారితో చేయబోతున్నా. చిరంజీవి, నాగార్జున లతో కూడా చేస్తే న కోరిక తీరుతుంది అని అనిల్ రావిపూడి అన్నారు.