SSMB28 : మహేశ్ బాబు - త్రివిక్రమ్ మూవీ ఫస్ట్ అప్డేట్ అప్పుడే.. ప్రస్తుతం యూనిట్ ఫోకస్ దానిపైనే!

By team teluguFirst Published Jan 5, 2023, 7:47 AM IST
Highlights

త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుండంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమా నుంచి క్రేజీ బజ్ వినిపిస్తోంది.  ఆ ఫెస్టివల్ స్పెషల్ గానే చిత్రం నుంచి ఫస్ట్ అప్డేట్ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ అప్ కమింగ్ ఫిల్మ్ SMB28 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించుకోబోతోంది. మహేశ్ ఇంట వరుస విషాదాలతో సినిమాకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.  డిసెంబర్ రెండో వారంలోనే పునఃప్రారంభం కావాల్సిన ఈ షెడ్యూల్ జనవరికి వాయిదా పడింది. ఈనెల సెకండ్ వీక్ లో షూట్ జరుగుతుందని తెలుస్తోంది. ఇందుకు యూనిట్ సంబంధిత పనులు జరుపుతున్నట్టు సమాచారం. 

ప్రస్తుతం మహేశ్ బాబు ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు స్విజ్జర్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. త్వరలోనే హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఇక పూజా హెగ్దే కూడా ఇప్పుడు విదేశాల్లోనే ఉంది. మహేశ్ బాబు రాగానే లాంగ్ రన్ లో 60 రోజుల పాటు సెకండ్ షెడ్యూల్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ చిత్ర యూనిట్  తో కలిసి రెండో షెడ్యూల్ ను అనుకున్నట్టుగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని చూస్తున్న అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ ఒకటి అందింది.

ఇప్పటికే షూటింగ్ స్టార్ చేసినట్టు గ్లింప్స్ నువదిలిన విషయం తెలిసిందే. దీంతో ‘ఎస్ఎస్ఎంబీ28’ ఫస్ట్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. రెండో షెడ్యూల్ పూర్తయ్యాకే  SSMB28 నుంచి తొలి అప్డేట్ రానుందంట. దాన్ని కూడా మార్చి 27న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారంట యూనిట్. ఇక అప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఉండవని తెలిసిపోతోంది. ఇప్పటికే ఆలస్యమైన ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 

పదేండ్ల తర్వాత త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబో సెట్ అవడంతో  సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు మహేశ్ సరికొత్త లుక్ లోకి షిఫ్ట్ అవడంతో మరింత ఆసక్తిని పెంచుతోంది. మూవీలో Pooja Hegdeతో పాటు శ్రీలీలా సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తోంది. రష్మిక మందన్న చేత స్పెషల్‌ సాంగ్‌ చేయించబోతున్నారని టాక్. సింగర్ సునీత, బన్నీ కూతురు అల్లు అర్హ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

click me!