ఒక డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ జోనర్ లో ఉండే కథని నెల్సన్.. అల్లు అర్జున్ కి వివరించినట్లు తెలుస్తోంది. బన్నీ కూడా ఈ కథపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు చాలా మంది దర్శకులే క్యూలో ఉన్నారు. వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సందీప్ రెడ్డి వంగా లాంటి వారు ఉన్నారు. అయితే వీరిలో త్రివిక్రమ్ చిత్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఇక తదుపరి చిత్రాల విషయంలో బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనా పుష్ప 2 షూటింగ్ పూర్తయ్యే సరికి క్లారిటీ వస్తుంది. అయితే తాజాగా ఒక క్రేజీ న్యూస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఆసక్తి పెంచేస్తోంది. అల్లు కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇటీవల బన్నీకి స్టోరీ నేరేట్ చేశారట.
ఒక డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ జోనర్ లో ఉండే కథని నెల్సన్.. అల్లు అర్జున్ కి వివరించినట్లు తెలుస్తోంది. బన్నీ కూడా ఈ కథపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బన్నీ, నెల్సన్ మధ్య మీటింగ్ అరేంజ్ చేసింది రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి అని తెలుస్తోంది.
అంతా ఒకే అయితే బన్నీ, నెల్సన్ చిత్రాన్ని బుజ్జినే నిర్మించనున్నారట. ఈ చిత్రానికి ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 200 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని వైవిధ్యంగా తెరకెక్కిస్తారు. రజనీకాంత్ జైలర్ చిత్రం భలే క్లిక్ అయింది.
కంప్లీట్ స్క్రిప్ట్ లాక్ అయితే వచ్చే ఏడాది షూటింగ్ కూడా ప్రారంభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావాలని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.