పబ్లిక్ లో నన్ను అసభ్యంగా.. కంగనా షాకింగ్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Jan 22, 2019, 12:39 PM IST
Highlights

పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తన వెనుక భాగాన్ని గిల్లినట్లు చెప్పింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె నటించిన 'మణికర్ణిక' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు. 

పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తన వెనుక భాగాన్ని గిల్లినట్లు చెప్పింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె నటించిన 'మణికర్ణిక' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మీటూపై కొన్ని కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. గతంలో మీటూకి సంబంధించి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నిర్మాత వికాస్ బెహెల్ లు తన పట్ల ప్రవర్తించిన తీరుని మీడియా ముందు వెల్లడించిన కంగనా తాజాగా ఆమె ఎదుర్కొన్న మరో సంఘటన గురించి వెల్లడించింది.

''ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు పబ్లిక్లోనే ఓ వ్యక్తి తాకరాని చోట తాకుతూ నన్ను గిల్లాడు. ఇప్పుడు ఏం చేయగలవు అన్నట్లుగా అతడు చూసిన చూపుతో నాకు చిరాకు వచ్చింది'' అంటూ తెలిపింది.

ఆడపిల్లల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఓ చర్చా వేదికలో రాణీముఖర్జీ చెప్పారని.. ఆమె చెప్పింది నిజమేనని చెప్పుకొచ్చింది కంగనా. మీటూ ప్రభావం చిత్ర పరిశ్రమలో బాగా ఉందని, నటీనటులతో అసభ్యంగా ప్రవర్తించే వారు ఉంటారని, ఆడపిల్లల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వారి భద్రతకి బాధ్యత వారిదేనని తెలిపింది. 

click me!