రవితేజ నిర్మించిన ‘మట్టి కుస్తీ’ మొత్తం కలెక్షన్స్ ఎంత? సక్సెస్ మీట్ లో ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్!

By team teluguFirst Published Dec 9, 2022, 12:08 PM IST
Highlights

మాస్ మహారాజ రవితేజ నిర్మించిన తాజా చిత్రం ‘మట్టి కుస్తీ’. ఈనెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంత చేసుకుంది. దీంతో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ అందాయి.
 

తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishnal) కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను అందుకుంటున్నాడు. చివరిగా ‘ఎఫ్ఐఆర్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇక రీసెంట్ గా తమిళంలో రూపొందిన స్పోర్గ్స్ డ్రామా Matti Kusthiతోనూ అలరించారు. విష్ణు విశాల్ బ్యానర్ పై మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)తో కలిసి నిర్మించిన ఈ సినిమా ఈనెల 2న (డిసెంబర్) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను సొంత చేసుకుంది. 

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. తెలుగులోనూ సినిమాకు పాజిటివ్ టాక్ ఏర్పడింది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ ను చెన్నైలో  సక్సెస్ మీట్ ను నిర్వహించింది. సినిమాను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు సినిమా రూ.30 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని చెప్పారు. ఇంకా థియేటర్లలో సందడి చేస్తుండటంతో ఇంకా కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నామన్నారు. 

ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే పాజిటివ్ రిపోర్ట్ ను సొంతం చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. టీం వర్క్ తోనే విజయవం సాధ్యమైందని హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి తెలిపారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ - ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించారు. ఆర్టీ టీమ్ వర్క్స్, వీవీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రపు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఉధయనిధి స్టాలిన్ కు చెందిన రెడ్ గెయింట్ మూవీస్ దక్కించుకుంది. ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం  చేసుకుంది. 
 

click me!