సాయి పల్లవిని నమ్ముకొని  బుక్కైన డైరెక్టర్ తేజ!

By team teluguFirst Published Jan 28, 2021, 4:05 PM IST
Highlights

అలివేలుమంగ వెంకటరమణ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. గోపి చంద్ హీరోగా ఈ మూవీ లాంఛింగ్ కి సర్వం సిద్ధమైంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా దర్శకుడు తేజ సాయి పల్లవిని అనుకున్నారట. ఇదే విషయమై ఆమెను సంప్రదించడం కూడా చేశారట. అన్నీ ఓకే కానీ రెమ్యూనరేషన్ విషయంలో సాయి పల్లవి తేజాకు ఝలక్ ఇచ్చారట.

స్టార్ డైరెక్టర్ గా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన దర్శకుడు తేజ, విజయాల పరంగా వెనుకబడ్డారు. ఆయన క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. రానా హీరోగా తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అప్పుడెప్పుడో వచ్చిన జయం మూవీ తరువాత తేజ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. ఆమధ్య ఫిల్మ్ ఛాంబర్ లో అలివేలుమంగ వెంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు అనే రెండు భిన్నమైన టైటిల్స్ ఆయన రిజిస్టర్ చేయించారు. 

ఈ రెండు చిత్రాల్లో అలివేలుమంగ వెంకటరమణ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. గోపి చంద్ హీరోగా ఈ మూవీ లాంఛింగ్ కి సర్వం సిద్ధమైంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా దర్శకుడు తేజ సాయి పల్లవిని అనుకున్నారట. ఇదే విషయమై ఆమెను సంప్రదించడం కూడా చేశారట. అన్నీ ఓకే కానీ రెమ్యూనరేషన్ విషయంలో సాయి పల్లవి తేజాకు ఝలక్ ఇచ్చారట. అలివేలుమంగ వెంకటరమణ  మూవీ కోసం ఆమెకు ఏకంగా రూ. 1.25  కోట్లు అడుగుతున్నారట. 

గతంలో సాయి పల్లవి సినిమాకు రూ. 80లక్షల వరకు తీసుకొనేవారట. అదే అంచనాతో సాయి పల్లవికి ఆఫర్ ఇవ్వగా డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ గురించి తెలుసుకొని షాక్ అయ్యారట. ఇప్పటికే కీర్తి సురేష్, కాజల్ అగర్వాల్ లను సంప్రదించి, రెమ్యూనరేషన్ కారణం వారిని వద్దనుకున్నారట. సాయి పల్లవి తక్కువకు చేస్తుందిలే అనుకుంటే ఆమెకు కూడా భారీగా డిమాండ్ చేస్తూ చిత్ర నిర్మాతలను అయోమయంలో పడవేశారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, వైరల్ అవుతుంది. 

click me!