అభిమానుల మృతిపై హీరో యష్ తీవ్ర భావోద్వేగం!

By Sambi ReddyFirst Published Jan 9, 2024, 3:42 PM IST
Highlights

ప్రమాదంలో ముగ్గురు అభిమానులు మరణించగా వారి కుటుంబాలను యష్ కలిశాడు. యువకుల స్వగ్రామం వెళ్లిన హీరో యష్ వారి తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యాడు. 
 

నిన్న హీరో యష్ పుట్టినరోజు కాగా, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. అయితే యష్ జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుత్ ఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు. లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన యష్ అభిమానులు జనవరి 7 రాత్రి బర్త్ డే బ్యానర్స్ సొంత ఊరిలో ఏర్పాటు చేస్తున్నారు. బ్యానర్స్ కట్టే క్రమంలో ఎలక్ట్రిక్ షాక్ కి గురయ్యారు. 

హనుమంత మజ్జురప్ప హరిజన్(20), మురళీ నీలప్ప నిడివిమని(20) నవీన నీలప్ప గజి(19) అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కూడా షాక్ కి గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు. 25 అడుగుల ఎత్తుల్లో బ్యానర్స్ ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Latest Videos

అభిమానుల మృతి వార్త తెలుసుకున్న హీరో యష్ సురంగి గ్రామానికి వెళ్లారు. మృతి చెందిన యువకుల కుటుంబ సభ్యులను కలిశారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా యష్ ఎమోషనల్ అయ్యారు. మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు అండగా ఉంటాను. వారికి ఎలాంటి అవసరం వచ్చినా తీర్చుతాను. చేతికి అందిన బిడ్డలు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఏం చేసినా వారి బిడ్డలు తిరిగిరారు. 

ఇందుకే నేను చాలా సింపుల్ గా బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాను. అభిమానులు నాకోసం బ్యానర్స్ ఏర్పాటు చేయవద్దు. మీరు మా గురించి కాదు. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇలాంటి అభిమానం నేను కోరుకోవడం లేదని... యష్ భావోద్వేగానికి గురయ్యాడు. సురంగి గ్రామానికి యష్ వస్తున్నాడని తెలిసి అక్కడకు భారీగా అభిమానులు చేరుకున్నారు. యష్ ని చూసేందుకు వెళుతూ ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. 

click me!