మా హీరో `బంగారం` అనిపించుకున్న తమిళ స్టార్‌ శింబు

By Aithagoni RajuFirst Published Nov 8, 2020, 11:56 AM IST
Highlights

తమిళ స్టార్‌ శింబు నిజంగానే బంగారం అనిపించుకున్నారు. తన చిత్ర యూనిట్‌ చేత బంగారం అనిపించుకున్నారు. మరి బంగారం అనిపించుకునేంత పని ఏం చేశాడో తెలిస్తే మాత్రం నిజంగానే బంగారం అనక మానరు. 

సినిమాల్లో మంచి పని చేసి హీరో బంగారం అనిపించుకోవడం సర్వసాధారణమే. కానీ రియల్‌ లైఫ్‌లో అలా అనిపించుకోవడానికి గొప్ప హృదయం కావాలి. ఎంతో సేవా గుణం ఉండాలి. ప్రస్తుతం తమిళ స్టార్‌ శింబు నిజంగానే బంగారం అనిపించుకున్నారు. తన చిత్ర యూనిట్‌ చేత బంగారం అనిపించుకున్నారు. మరి బంగారం అనిపించుకునేంత పని ఏం చేశాడో తెలిస్తే మాత్రం నిజంగానే బంగారం అనక మానరు. 

ప్రస్తుతం శింబు `ఈశ్వరన్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల  చేసిన ఫస్ట్ లుక్‌ ఆకట్టుకుంటుంది. మెడలో నాగుపాముతో, చేతిలో బ్యాట్‌తో ఉన్న లుక్‌లు సినిపై ఆసక్తిని పెంచాయి. సుశీంద్రన్‌ దర్శకత్వంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శింబు తన చిత్ర యూనిట్‌కి బంగారు నాణేలు పంచారు. ఒక్కొక్కరి ఒక్కో గ్రామ్‌ బంగారం చొప్పున నాలుగు వందల మందికి పంచిపెట్టారు. బంగారంతోపాటు వారికి జత బట్టలు పెట్టారు.

 మరో రెండు వందల మందికి బట్టలు పంపిణి చేశారు. దీంతో వారంతా శింబు నిజంగానే బంగారం అంటున్నారు.  ఈ సినిమా కోసం ఆయన ముప్పై కేజీలు తగ్గడం విశేషం. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

click me!