హీరో నిఖిల్‌ `ది ఇండియా హౌస్‌` సినిమా సెట్‌లో ప్రమాదం.. పగిలిపోయిన భారీ వాటర్‌ ట్యాంకర్‌.. వారికి గాయాలు

Published : Jun 11, 2025, 10:48 PM IST
nikhil siddharth

సారాంశం

హీరో నిఖిల్‌ ప్రస్తుతం `ది ఇండియా హౌస్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వాటర్‌ ట్యాంక్‌ పగిలిపోయిందట. 

యంగ్‌ హీరో నిఖిల్‌ ప్రస్తుతం `ది ఇండియా హౌస్‌` పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సమర్పకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 

అయితే ఈ మూవీ సెట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శంషాబాద్‌లో సమీపంలో జరుగుతుంది. షూటింగ్‌లో భాగంగా సముద్రం సీన్లు తీసేందుకు భారీగా సెట్‌ ఏర్పాటు చేశారు. దీంతోపాటు భారీగా వాటర్‌ ట్యాంక్‌ని కూడా ఏర్పాటు చేశారు.

నిఖిల్‌ `ది ఇండియా హౌస్‌`  అసిస్టెంట్‌ కెమెరామెన్‌కి తీవ్ర గాయాలు 

వాటర్‌ ట్యాంకర్‌ పగిలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్యాంక్‌ పగలడంతో లొకేషన్‌ మొత్తం వరదతో నిండిపోయింది. భారీ వాటర్‌ ట్యాంక్‌ ఒక్కసారిగా పగిలిపోవడంతో సెట్ మొత్తం అల్లకల్లోలం అయ్యింది. 

ఈ ఘటనలో అసిస్టెంట్‌ కెమెరామెన్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోది. ఆయనతోపాటు మరికొంత మందికి గాయాలైనట్టు సమాచారం. అదే సమయంలో సెట్‌ కూడా డ్యామేజ్‌ జరిగిందని, నష్టం తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

రామ్‌ చరణ్‌ సమర్పణలో `ది ఇండియా హౌస్‌`

ఇక నిఖిల్‌ హీరోగా, సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా `ది ఇండియా హౌస్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రూపొందుతుంది. ఈ మూవీని రామ్‌ చరణ్‌ సమర్పిస్తుండటం విశేషం. అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్‌ వంశీ దర్వకత్వం వహిస్తున్నారు.

1905 నాటి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సినిమా

`ది ఇండియా హౌస్‌` చిత్రం 1905 నాటి స్వాతంత్య్రం  పోరాటం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. ఆ స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రేమ, విప్లవం అంశాలను ప్రధానంగా చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. 

ఇందులో అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకోవడం విచారకరం.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today డిసెంబర్ 06 ఎపిసోడ్ : రామరాజు గ్రీన్ సిగ్నల్.. వల్లికి ఉద్యోగం తిప్పలు, ఇరికించిన నర్మద, ప్రేమ
Superstar Krishna హీరోగా పూరీ జగన్నాథ్‌ ఫస్ట్ మూవీ ఎలా ఆగిపోయిందో తెలుసా? రెండు సార్లు చేదు అనుభవం