ఆమెతో రొమాంటిక్ టూర్ లో హీరో నిఖిల్!

By Sambi ReddyFirst Published Jan 9, 2023, 4:25 PM IST
Highlights

వరుస చిత్రాలతో బిజీగా గడిపిన నిఖిల్ షార్ట్ బ్రేక్ తీసుకున్నాడు. భార్య పల్లవితో పాటు రొమాంటిక్ టూర్ ప్లాన్ చేశాడు. ఈ విషయం స్వయంగా తెలియజేశాడు. 
 


2022 నిఖిల్ కి బాగా కలిసొచ్చింది. పాన్ ఇండియా హిట్ ఆయన సొంతమైంది. కార్తికేయ 2 తో ఇండియా వైడ్ మోత మోగించాడు . దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సోసియో ఫాంటసీ చిత్రం కార్తికేయ 2 అన్ని భాషల్లో ఆదరణ సొంతం చేసుకుంది. పెట్టుబడికి రెండు మూడు రెట్లు లాభాలు అందించింది. ఇక కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ చిత్రాన్ని నిఖిల్ పూర్తి చేశాడు. నాలుగు నెలల వ్యవధిలో 18 పేజెస్ విడుదల చేశారు. ఆగస్టులో కార్తికేయ 2, డిసెంబర్ లో 18 పేజెస్ విడుదలయ్యాయి. 

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. అయితే 18 పేజెస్ నిర్మాతలకు లాభాలు పంచినట్లు తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ ద్వారానే రూ. 8 కోట్ల లాభాలు 18 పేజెస్ చిత్రానికి వచ్చాయట. థియేటర్స్ లో వచ్చిన వసూళ్లు మొత్తం లాభం క్రిందే లెక్క అని సమాచారం. ఆ విధంగా చూస్తే బ్యాక్ టు బ్యాక్ నిఖిల్ రెండు హిట్స్ కొట్టినట్లు. ఇక కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల షూటింగ్స్, మీటింగ్స్, ప్రమోషన్స్, అంటూ నిఖిల్ చాలా బిజీగా గడిపాడు.

రీఛార్జ్ కావాలంటే వెకేషన్ కి వెళ్లడమే సరైన మార్గం అనుకున్నారు. భార్య పల్లవితో పాటు ఆయన రొమాంటిక్ టూర్ కి వెళ్లారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కొద్దిరోజులు ఆయన హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసి రానున్నారు. 2020 లాక్ డౌన్ సమయంలో నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కారు. ఆంక్షల మధ్య అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పల్లవి డాక్టర్ అని సమాచారం. ఇటీవల నిఖిల్-పల్లవి విడిపోతున్నట్లు వార్తలు రాగా... ఖండించారు. 

నిఖిల్ కెరీర్ గాడినపడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్పై టైటిల్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. మరొకొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. హ్యాపీ డేస్ మూవీతో వెలుగులోకి వచ్చిన నటుల్లో నిఖిల్ ఒకరు. శేఖర్ కమ్ముల లైఫ్ ఇచ్చిన నటుల్లో తమన్నా, నిఖిల్ మాత్రమే సక్సెస్ అయ్యారు. వరుణ్ సందేశం కి మంచి ఆరంభం లభించినా... పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయాడు. 
 

click me!