ఎక్కడ కలిశారయ్యా... సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ 

By Sambi ReddyFirst Published Mar 17, 2023, 8:18 PM IST
Highlights

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తో చరిత్ర లిఖించారు. ఏకంగా ఆస్కార్ కైవసం చేసుకున్నారు. దీంతో ఆయన నెక్స్ట్ మూవీపై అంచనాలు ఆకాశానికి చేరాయి. 
 

ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్ అయ్యారు. ఆస్కార్ వేదికగా ఆయన పేరు మారు మ్రోగింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆస్కార్ గెలుచుకోవడం ద్వారా నాపై మరింత బాధ్యత పెరిగిందని రాజమౌళి వెల్లడించారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్ మహేష్ మూవీ మీద అంచనాలు పెరిగాయి. మహేష్ 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి అప్పుడే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

మహేష్ మూవీ బడ్జెట్ రూ. 800 నుండి 1000 కోట్లు కేటాయించారట. మహేష్ కి జంటగా ఒక హాలీవుడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్నారట. అలాగే హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. మహేష్ తో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కథగా ఇది ఉంటుందన్నారు. ఆర్ ఆర్ ఆర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. 

కాగా మహేష్-రాజమౌళి కలిసి మాట్లాడుకుంటున్న ఒక ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. సదరు ఫొటోలో మహేష్ ఏదో మాట్లాడుతుండగా రాజమౌళి ఆసక్తికరంగా వింటున్నారు. జస్ట్ వారు కలిశారో లేదో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అలాగే రాజమౌళి, మహేష్ ఎప్పుడు కలిశారు? సందర్భం ఏంటనే చర్చ నడుస్తుంది. 

ఇక ఈ ఏడాదే మహేష్ మూవీని రాజమౌళి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఒక చిత్రం చేస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!