వై ఎస్ జగన్ పాత్ర కోసం హీరో జీవా ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

By Mahesh JujjuriFirst Published Feb 7, 2024, 5:53 PM IST
Highlights

రిలీజ్ కు రెడీ గా ఉంది సీఎం వైఎస్ జగన్ బయోపిక్ మూవీ యాత్ర2. ఈ సినిమాలో జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. ఇక ఈ పాత్ర కోసం జీవా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే..? 
 

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉండగా చేసిన పాదయాత్ర విశేషాలతో తెరకెక్కిన మూవీ యాత్ర2. గతంలో దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ను బేస్ చేసుకుని తీసిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈమూవీ తెరకెక్కింది.  యాత్రలో .. ఇప్పుడు యాత్రా2 లో రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషించగా..ఈమూలో వైఎస్ జగన్ పాత్రను జీవ పోషించారు. 

దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన యాత్ర2 మూవీ మరికొన్ని గంటల్లో  థియేటర్లలో రిలీజవుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నిర్మించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ సర్టిఫికెట్ వచ్చింది. కాని ఈూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం పెద్దగా రాలేదు. డైరెక్ట్  బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి అని నమ్మకంతో ఉన్నారు టీమ్. 

Latest Videos

ఇక ప్రస్తుతం ఈసినిమాకుసబంధిచిన కాంట్రవర్సీలతో పాటు మరో విషయం కూడా వైరల్అవుతుంది. అదేంటంటే.. ఈసినిమాకు గాను రెమ్యూనరేషన్లు ఎంత ఇచ్చారు అని. ముఖ్యంగా జగన్ పాత్రధారి జీవాకు ఈసినిమాలో నటించినందుకు దాదాపు 8 వరకూ ముట్టినట్టు తెలస్తోంది. అంతే కాదు రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన మమ్ముట్టికి 4 కోట్ల వరకూ ఇచ్చారట. ఈసినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే.. దాదాపు 25 కోట్లు రెమ్యూనరేషన్లకే పెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమా ను ఎక్కువ శాతం.. కడప, పులివెందులలో షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. 

click me!