డబ్బింగ్ ఆర్టిస్ కి క్షమాపణలు చెప్పిన రాశిఖన్నా!

By AN TeluguFirst Published May 18, 2019, 10:06 AM IST
Highlights

తనకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ కి సినీ నటి రాశిఖన్నా క్షమాపణలు చెప్పారు. ఆమె హీరోయిన్ గా విశాల్ కి జోడీగా నటించిన 'అయోగ్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తనకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ కి సినీ నటి రాశిఖన్నా క్షమాపణలు చెప్పారు. ఆమె హీరోయిన్ గా విశాల్ కి జోడీగా నటించిన 'అయోగ్య' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాశికి రవీనా అనే అమ్మాయి డబ్బింగ్ చెప్పారు.

అయితే సినిమా క్రెడిట్స్ లో రవీనా పేరు జోడించలేదు. దాంతో ట్విట్టర్ వేదికగా రవీనా తన బాధను వెళ్లగక్కారు. 'అయోగ్య' సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు క్రెడిట్స్ ఇవ్వలేదని, షూటింగ్ లో ఉన్న డ్రైవర్లు, పెయింటర్లు, సౌండ్ ఇంజనీర్ల పేర్లు క్రెడిట్స్ లో పేర్కొన్నందుకు సంతోషంగా ఉందని.. కానీ డబ్బింగ్ కేటగిరీని  పట్టించుకోనందుకు బాధగా ఉందని అన్నారు.

ఇది చూసిన రాశిఖన్నా రవీనాకు క్షమాపణలు చెప్పింది. 'నీ మధురమైన స్వరాన్ని అరువిచ్చి నా పాత్రను మరింత అందంగా మలచినందుకు ధన్యవాదాలు' అని తెలిపారు.

దీనికి రవీనా ప్రతిస్పందిస్తూ.. 'ధన్యవాదాలు రాశీ.. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పుకాదు.. మీకు డబ్బింగ్ చెప్పినందుకు సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'టెంపర్'కు 'అయోగ్య' రీమేక్ గా వచ్చింది. 
 

click me!