హ్యాట్రిక్ కొట్టిన హెబా పటేల్
కుమారి ఎఫ్ 21తో.. టాలీవుడ్ ఎంట్రీ
క్రేజీ హీరోయిన్ గా మారిన హెబా
కుమారి 21 ఎఫ్ మూవీతో యాత్ హార్ట్స్ ను క్రాష్ చేసింది హెబ్బా పటేల్. సుకుమార్ ప్రొడక్షన్ లోని సినిమాతో ఒక్కసారి స్టార్ గా మారింది. అంతకు ముందు అలా ఎలా అనే సినిమా చేసినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ కుమారి 21 ఎఫ్ తర్వాత ఒక్కసారిగా ఆమె క్రేజ్ అందుకుంది. బోల్డ్ గా ఉండటం, గ్లామర్ డోస్ కి నో చెప్పకపోవడంతో..ఆమె ఇంటికి చాలా ఆఫర్లే క్యూ కట్టాయి.
కుమారి 21 ఎఫ్ తర్వాత ఈడో రకం ఆడో చిత్రం చేసింది. ఈ సినిమా కూడా హిట్టైంది. ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్ అందుకోవడంతో..ప్రస్తుతం హెబ్బా గోల్డెన్ గర్ల్ గా మారింది. హ్యాట్రిక్ హిట్స్ అందుకోని.. క్రేజీ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఇవి కూడా మంచి విజయాలుగా నమోదైతే... హెబ్బా పటేల్ టాలీవుడ్ లీడింగ్ లేడీగా మారిన ఆశ్చర్యంలేదు.
ఇప్పటికే వరుణ్ తేజ్ సరసన మిస్టర్ చిత్రంలో ఛాన్స్ అందిపుచ్చుకుంది. ఈ సినిమా హిట్టైతే..మెగా క్యాంప్ లో మరిన్ని చిత్రాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. నేను నా బాయ్ ఫ్రెండ్స్,యాంజెల్,అందగాడు చిత్రాలు ప్రస్తుతం హెబ్బ చేతిలో ఉన్న ప్రాజెక్టులు. టాలీవుడ్ లో బిజీ గా మారడంతో హెబ్బా ప్రస్తుతం తెలుగు నేర్చుకునే పనిలో పడిందట.