#Hanuman థియేటర్ రైట్స్ ఎంతకు అమ్మారు, ఎంత రావచ్చు

By Surya PrakashFirst Published Jan 12, 2024, 3:17 PM IST
Highlights

నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత... ఎంత బిజినెస్ చేసారు వంటి విషయాలు చూద్దాం.
 

అనేక చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ (Teja Sajja) తాజా చిత్రం ‘హను-మాన్‌’ (Hanu Man). ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అయ్యింది. మరోవైపు, సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu)- డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఈ రోజున అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రంకు థియేటర్స్ తక్కువ కేటాయించారని వివాదాలు సైతం వచ్చాయి. అయితే నార్త్ మార్కెట్ ని భారీగా టార్గెట్ చేస్తున్న ‘హను-మాన్‌’ పూర్తి రికవరీ మోడ్ లో ఉందని ట్రేడ్ అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత... ఎంత బిజినెస్ చేసారు వంటి విషయాలు చూద్దాం.

ట్రైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం  27 కోట్లకు అమ్మారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాల్లో ఇదే హైయిస్ట్ రేటు పలికిన చిత్రం. ఈ సినిమా నైజాం ఏరియా  7.15 కోట్లు, సీడెడ్ 4 కోట్లు, ఆంధ్రా ఏరియాకు  9.5 కోట్లు అమ్ముడయ్యాయి. అలాగే రెస్టాఫ్ ఇండియా 2 కోట్లు, ఓవర్ సీస్ లో 4 కోట్లు మొత్తం మీద 26.65 కోట్లు బిజినెస్ అయ్యింది. ఇప్పుడున్న పాజిటివ్  ట్రెండ్ ని బట్టి చూస్తే అన్నీ ఏరియాలు లాభాలు చూస్తారని, ఓవరాల్ గా థియేటర్ బిజినెస్ 50 దాకా రీచ్ అవుతుందని చెప్తున్నారు. 

Latest Videos

 మరో ప్రక్క   డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మెజారిటీ రిక‌వ‌రీ అయింద‌ని స‌మాచారం.  ఈ చిత్రం నాన్ థియేటర్ బిజినెస్ రైట్స్ ని Zee గ్రూప్ వారు 30 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో బడ్జెట్ లో సగం అక్కడే రికవరీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో మరో 20 కోట్లుకు బిజినెస్ చేసారని తెలుస్తోంది. అలా మొత్తం 50 కోట్ల వరకూ బడ్జెట్ నాన్ థియేటర్ రైట్స్, తెలుగు రాష్ట్రాల బిజినెస్ తో రికవరీ అయ్యిందని సమాచారం. ఇక సినిమా ఓవర్ సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశంలో మిగతా ప్రాంతాలు, ముఖ్యంగా నార్త్ బెల్ట్  మంచి బిజినెస్ చేసాయి. డిస్ట్రిబ్యూటర్ రికవరీ రెట్టింపు పైగైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
    
   తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.
 

click me!