గోపీచంద్ మలినేని కు రజనీ కాంత్ ఫోన్, ఫుల్ ఖషీ

By Surya PrakashFirst Published Jan 30, 2023, 7:06 AM IST
Highlights

తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుండి కాల్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూసి నాకు కాల్ చేసి.. 


తెలుగులో  స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా  గోపీచంద్ మలినేని ఎదిగారు. ఆయన క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  బాలయ్య సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాల వరసలో వీరసింహారెడ్డి మూవీ కూడా నిలిచింది.  ఇప్పటికి విజయవంతంగా ఈ సినిమా కొనసాగుతూ రికార్డ్ కలక్షన్స్ ను రాబడుతోంది. అభిమానులే కాకుండా ప్రముఖులు కూడా ఈ సినిమాను చూసి ప్రశంసిస్తున్నారు.  తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ చూసారు. సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ మలినేని ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

This is a surreal moment for me🤩🤗

Received a call from the Thalaivar, The Superstar sir. He watched and loved the film.

His Words of praise about my film and the emotion he felt are more than anything in this world to me. Thankyou Rajini sir🙏

— Gopichandh Malineni (@megopichand)

 
” ఇది నాకు నమ్మలేని ఒక క్షణం.. తలైవర్, సూపర్ స్టార్ రజినీకాంత్ సార్ నుండి కాల్ వచ్చింది. ఆయన వీరసింహారెడ్డి సినిమాను చూసి నాకు కాల్ చేసి.. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. నా సినిమా గురించి ఆయన ప్రశంసించడం, ఆయన భావోద్వేగంనాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

రజినీ, నందమూరి బాలకృష్ణ కు కూడా ఫోన్ చేసి ఉండొచ్చు.. కానీ, బాలయ్య, తారకరత్న హెల్త్ విషయంలో అప్సెట్ గా ఉండడంతో ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకోలేకపోవచ్చని, ఏది ఏమైనా బాలయ్య సినిమాను రజినీ మెచ్చుకోవడంతో అది బాలయ్య అంటూ అభిమానులు అంటున్నారు.

ఈ సినిమాలో ఫస్టాఫ్ ను ఫ్యాన్ బాయ్ గా తీశానని సెకండాఫ్ ను మాత్రం దర్శకునిగా తీశానని గోపీచంద్ మలినేని వెల్లడించారు. థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని రామ్ లక్ష్మణ్ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా డిజైన్ చేశారని గోపీచంద్ మలినేని వెల్లడించడం గమనార్హం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆ కెరీర్ లోనే మంచి నిర్మాతలు అని వాళ్లతో సినిమాలు చేస్తూనే ఉంటానని గోపీచంద్ మలినేని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపం, థమన్ మ్యూజిక్, శృతి, హనీ రోజ్ అందాలు అన్నింటికీ మించి ఒక బాలయ్య అభిమానిగా గోపీచంద్ మలినేని టేకింగ్.. ఈ సినిమాను విజయం వైపు తీసుకెళ్లాయి. 

click me!