అది అసత్య ప్రచారం, నెక్స్ట్ మూవీ ఆయనతోనే: గోపీచంద్ మలినేని

By tirumala ANFirst Published Aug 28, 2019, 7:52 PM IST
Highlights

బలుపు, పండగ చేస్కో లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ దర్శకుడు తెరకెక్కించిన చివరి చిత్రం విన్నర్. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నుంచి మరో చిత్రం రాలేదు. 

బలుపు, పండగ చేస్కో లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ దర్శకుడు తెరకెక్కించిన చివరి చిత్రం విన్నర్. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ నుంచి మరో చిత్రం రాలేదు. 

దీనితో గోపీచంద్ తదుపరి మూవీ గురించి అనేక ఊహాగానాలు వినిపించాయి. సాయిధరమ్ తేజ్ తోనే మరో చిత్రం ఉంటుందని, రవితేజని డైరెక్ట్ చేయబోతున్నాడని అనేక ఊహాగానాలు వినిపించాయి. నాగార్జునతో ఓ చిత్రం ఖరారైపోయిందని లేటెస్ట్ గా ప్రచారం జరిగింది. దీనిపై గోపించంద్ స్పందించాడు. తన తదుపరి చిత్రం గురించి వెబ్ సైట్లలో వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపాడు. 

తన నెక్స్ట్ మూవీ రవితేజతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నట్లు గోపీచంద్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనునట్లు గోపించంద్ తెలిపాడు. 

 

An Update about my NEXT ✨

There is a false speculation about my next film on websites ...Pre production work for my Next film with Ravi teja garu is going on full swing

...will update further details very soon ... guys
We r going to be back very strong 💪🏼

— Gopichand Malineni (@megopichand)
click me!