తెలంగాణ ఎలక్షన్స్: బొక్కబోర్లా పడిన సినీస్టార్స్!

By Prashanth MFirst Published Dec 13, 2018, 6:23 PM IST
Highlights

 కానీ రాజకీయాల్లో కష్టపడే గుణంతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అయితే ఈ సారి సినీ ఫీల్డ్ కు చెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. 

సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎలాంటి సబంధాలు ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కదారి దొరికినా రెండు దారుల్లో ఈజీగా ప్రయాణం సాగించవచ్చు. కానీ రాజకీయాల్లో కష్టపడే గుణంతో పాటు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. అయితే ఈ సారి సినీ ఫీల్డ్ కు చెందిన టాలీవుడ్ సెలబ్రెటీలు తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. 

అప్పుడెప్పుడో ఈ రోజుల్లో సినిమాతో కుర్రకారును తెగ ఆకర్షించిన రేష్మ రాథోర్ ఖమ్మంలోని వైరా నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలోకి దిగారు. అయితే అక్కడ ఇండిపెండెట్ అభ్యర్థి రాములు నాయక్ భారీ మెజారితో గెలిచి ప్రధాన పార్టీలకు సైతం షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన టీఆరెస్ లో చేరారు. ఇక ఆంథోల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ టీఆరెస్ పార్టీ నుంచి టికెట్ కోల్పోవడంతో అలిగి బీజేపీ కండువా కప్పుకున్నారు. 

సీనియర్ జర్నలిస్ట్ క్రాంతికుమార్ కుమార్ కి టికెట్ ఇచ్చిన టీఆరెస్ మళ్ళీ ఆంథోల్ లో జెండా ఎగురవేసి బాబూమోహన్ కి షాక్ ఇచ్చింది. ఇక పైసా వసూల్ సినిమాతో దెబ్బతిన్న వి.ఆనంద్ ప్రసాద్ కి ఎమ్మెల్యే ని చేయాలనీ బాలకృష్ణ టీడీపీ తరపున పోట్లాడి మరి శేరి లింగంపల్లి టికెట్ ఇప్పించాడు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ మరోసారి గెలిచి సత్తా చాటారు. సినీ ఫీల్డ్ లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నా కూడా రాజకీయాల్లో అది సరిపోదని చాలా సార్లు నీరూపితమైంది. ఇక ఇప్పుడు ఈ ముగ్గురు ఓటములతో మరోసారి అది క్లియర్ గా అర్ధమయ్యింది.

click me!