సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ని స్పూఫ్ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.
టాలీవుడ్లో స్పూఫ్లకు అల్లరి నరేష్ కేరాఫ్గా నిలిచేవారు. అనేక సినిమాల్లోని డైలాగ్లను తన సినిమాల్లో వాడేవారు. ఏకంగా స్పూఫ్తోనే ఓ సినిమా తీశారు. అది అన్ని సార్లు వర్కౌట్ కాదు. దీంతో అల్లరి నరేష్ ట్రెండ్ మార్చారు.
ఇప్పుడు స్పూఫ్లతో కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారు. సినిమా అభిమానులు, హీరోల అభిమానులు స్పూఫ్లతో తమ ప్రతిభని చాటుకుంటున్నారు. ఆ మధ్య మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని ఫైట్ సీన్లని స్పూఫ్ చేసి మెప్పించారు. ఇప్పుడు ఎన్టీఆర్ని స్పూఫ్ చేశాడో కుర్రాడు. వేలూరు జోష్ అనే కుర్రాడు జోషి క్రియేషన్స్ పేరుతో ఈ వీడియోని రూపొందించారు.
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా పండుగని పురస్కరించుకుని `రామరాజుఫర్భీమ్` పేరు ఎన్టీఆర్ టీజర్ని విడుదల చేశారు. `రామరాజుఫర్భీమ్` టీజర్ ని అచ్ఛు గుద్దేశాడు జోషి అనే కుర్రాడు. ఎన్టీఆర్ స్థానంలో తాను భీమ్గా మారిపోయి వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించి మరీ టీజర్ని స్పూఫ్ చేశాడు. ఇది విశేషంగా ఆకట్టుకుంది. ఇది చూసి ఇంప్రెస్ అయిన `ఆర్ ఆర్ ఆర్` నిర్మాత డి.వి.వి దానయ్య ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పిచ్చి(అభిమానం)కి అంతం అనేది లేదు. మీరు చంపేశారు. మీకు మంచి భవిష్యత్ ఉండాలని కోరారు దానయ్య. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
The MADNESS doesn't end and you guys are killing it... ❤️
Keep recreating the avatars of Ramaraju and Bheem and get featured on our channel!! 🔥🌊
Ramaraju Intro videos - https://t.co/cxBpUPHGOt
Bheem Intro videos - https://t.co/1MBpWzU3go