ఏడుస్తూ.. మంచులక్ష్మి కాళ్ళమీదపడ్డ అభిమాని.. కారణం ఏంటంటే..?

By Mahesh JujjuriFirst Published Mar 19, 2024, 5:52 PM IST
Highlights

సాధారణంగా స్టార్ హీరోల సినిమా ఫంక్షన్స్ జరిగితే.. ఫ్యాన్స్ ఎవరో ఒకరు స్టేజ్ పైకి వచ్చి హీరోలను ఇబ్బందిపెడుతుంటారు. అయితే దానికి భిన్నంగా.. రీసెంట్ గా మంచు లక్ష్మికి ఇలాంటి అనుభవం జరిగింది.

సినిమా ఫక్షన్స్ జరిగితే చాలు.. స్టార్ హీరో స్టేజ్ మీద ఉన్నప్పుడు.. అభిమానులు ఎవరో ఒకరు సెక్యూరిటీ దాటుకుని వచ్చి.. హీరోలను గట్టిగాపట్టుకోవడం.. కాళ్ళ మీద పడటం లాంటివి చేస్తుంటారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో రిలీజ్ ఈవెంట్లలో ఇలాంటివి చూస్తుంటాం.  తాజాగా అలాంటి ఘటన మరోసారి జరిగింది. అయితే ఈ సారి ఏ స్టార్ హీరోకో ఈ  అనుభవం జరగలేదు..  నటి మంచు లక్ష్మికి ఈ ఘటన జరగడం గమనార్హం.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

దిపర్వం అనే సినిమాతో రాబోతుంది మంచు లక్ష్మి . తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ అభిమాని ఏడ్చుకుంటూ స్టేజిపైకి వచ్చి మంచు లక్ష్మి కాళ్ళ మీద పడ్డాడు. ఈ ఘటనపై మంచు లక్ష్మి ఆశ్చర్యపోయింది. అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. బౌన్సర్లు వెంటనే పైకి వచ్చి ఆ అభిమానిని కిందకి తీసుకెళ్లారు.

ఈవెంట్ అయి బయటకి వచ్చాక మంచు లక్ష్మి ఆ వ్యక్తితో ఫోటో దిగారు. సెల్ఫీ అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా అతను ఏడుస్తూ కనిపించాడు. ఏడుస్తున్న అతన్ని ఓదార్చారు మంచు లక్ష్మీ.  అయితే ఈ విషయంలో డిఫరెంట్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అలా ఈవెంట్ జరిగే టైమ్ లో వచ్చి కాళ్ల మీద పడటం.. అంతా ప్లాన్ ప్రకారం చేశారా అని కామెంట్లు పెడుతున్నారు. 

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.  అయితే మరికొంతమంది మాత్రం మంచు లక్ష్మి చేసే సహాయ కార్యక్రమాల్లో అతనికి ఏమైనా హెల్ప్ అయిందేమో అందుకే అలా చేసాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మీ ముంబయ్ లో ఉంటున్నారు. అక్కడే సినిమా ప్రయత్నాలు చేస్తూ.. ఫ్యాషన్ షోలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుుడు సినిమా ఈవెంట్ల కోసం మాత్రమే హైదరాబాద్ వస్తున్నారు మంచు లక్ష్మీ. 

click me!