బాలయ్య పాట రీమిక్స్ తో అదరగొట్టిన కల్యాణ్ రామ్, అమిగోస్ నుంచి రిలీజ్ అయిన సాంగ్..

By Mahesh JujjuriFirst Published Jan 31, 2023, 10:56 PM IST
Highlights

బాబాయ్ బాలయ్య బాబు రీమిక్స్ సాంగ్ తో అదరగొడుతున్నడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. అమిగోస్ నుంచి అదిరిపోయే పాట రిలీజ్ అయ్యింది. 

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా అమిగోస్.. ఈసినిమాతో త్వరలోనే ఫ్యాన్స్ ను అలరించబోతున్నాడు కల్యాణ్ రామ్. కన్నడ భామ ఆషికా రంగనాథ్‌ ఈ సినిమాలో  హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే బాలయ్య ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలా.. అమిగోస్ లో బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని సూపర్ హిట్‌సాంగ్‌ ను రీమిక్స్ చేశారు.  ఎన్నో రాత్రులొస్తాయి.. కానీ పాటను రీమిక్స్ చేశారు.  అయితే  ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాల్ హాల్ చల్ చేస్తోంది. ఇక రీసెంట్ గా వీడియో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. 

అమిగోస్' సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఈ సినిమాకి, రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన ర పాత్రల్లో.. డిఫరెంట్ లుక్స్ లో  కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి. 

తాజాగా ఈ సినిమా నుంచి  రిలీజ్ అయిన ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బాలకృష్ణ చేసిన 'ధర్మక్షేత్రం' సినిమాలో పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇళయరాజా స్వరకల్పనలో బాలు - చిత్ర ఆలపించిన ఆ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించుకుంటుంది.  రొమాంటిక్  సాంగ్స్ లో ముందువరుసలో నిలిచింది పాట. 

 

ఇక ఈ పాటను ఎంతో ఇష్టపడి.. ప్రత్యేకంగా ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ రీమిక్స్ చేయించాడు. ఎస్పీ చరణ్ - సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కల్యాణ్ రామ్ - ఆషిక రంగనాథ్ పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.  గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.

click me!