రాజకీయాలకి లింక్ చేయకండి: మంచు మనోజ్

By Udayavani DhuliFirst Published Oct 23, 2018, 11:35 AM IST
Highlights

ప్రజలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు.. దానికి రాజకీయ రంగు పూయోద్దని నటుడు మంచు మనోజ్ అంటున్నాడు. నిన్న తిరుపతికి వెళ్లిన మనోజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

ప్రజలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు.. దానికి రాజకీయ రంగుపూయోద్దని నటుడు మంచు మనోజ్ అంటున్నాడు. నిన్న తిరుపతికి వెళ్లిన మనోజ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఎయిర్ పోర్ట్ నుండి శ్రీవిద్యానికేతన్ కి వెళ్లే వరకు మంచు మనోజ్ కోసం బైక్ ల మీద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. ''నేను హైదరాబాద్ నుండిnతిరుపతికి నివసించడానికి వస్తున్నానంటే ఏదో ఊహించుకునే వాళ్లు ఉంటారు.

అందుకే ముందే చెబుతూ.. తిరుపతిలో కొంతకాలం ఉంటూ సమాజసేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వస్తున్నా.. మరో మూడు నెలల్లో నా కొత్త సినిమా మొదలవుతుంది. ఈ మూడు నెలల పాటు తిరుపతిలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడతాను.

దీనికి సంబంధించి 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక విడుదల చేస్తాను. ఇప్పటివరకు ఎవరూ చేయని విధంగా ఈ ప్లాన్ ఉంటుంది. రాజకీయాలు వేరు, సామజిక కార్యక్రమాలు వేరు. మనుషులని వేరు చేసే పరిపాలన మనకొద్దు. ప్రేమ, స్నేహం గొప్పవి'' అంటూ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు..

మనోజ్ కొత్త జర్నీ.. ప్రపంచమంతా విస్తరింపజేస్తాడట! 

మంచు మనోజ్ 'లేఖ' వెనక అసలు స్కెచ్ ఇదా?

 

click me!