ఈ ప్రమాదంలో ఆమెకు రెండు ఎముకలు విరిగినట్లు సమాచారం. ఇవాళ ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
పాపులర్ టీవి సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. గురువారం ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతి ఎముకలు విరగడంతో శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా ఇనిస్ట్రా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఆయన హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు.
యే హై మొహబ్బతీన్ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు యాక్సిడెంట్ అవ్వటంతో అభిమానులు కంగారు పడుతున్నారు. మరో ప్రక్క బాలీవుడ్ స్టార్స్ దివ్యాంక త్రిపాఠి కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఆమె భర్త వివేక్ నటికి సంబంధించిన ఎక్స్ రేను సైతం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రమాదంలో ఆమెకు రెండు ఎముకలు విరిగినట్లు సమాచారం. ఇవాళ ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. దివ్యాంక త్రిపాఠి తన కెరీర్లో అనేక సీరియల్స్తో పాటు రియాలిటీ షోలలో పాల్గొంది.
దివ్యాంక త్రిపాఠి దహియా రీసెంట్ గా క్యాస్టింగ్ కౌచ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. కెరియర్ ప్రారంభ సమయంలో ఆఫర్లు లేక చేతిలో చిల్లిగవ్వ లేదని సమయంలో తనకు ఓ ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఎంతో సంతోషంతో ఆడిషన్కు వెళ్తే డైరెక్టర్తో ఒక రోజు రాత్రి గడిపితేనే అవకాశం ఇప్పిస్తానని ఓ వ్యక్తి చెప్పాడని.. ఆ మాటలు విని షాక్ అయ్యాయని పేర్కొంది.
అప్పుడే ఇండస్ట్రీలో చాలా మంది అలాంటివారే ఉన్నారనుకున్నానని.. అందుకే ఆ సమయంలో ఆ ఆఫర్ని వద్దనుకొని అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. ఇండస్ట్రీలో అలాంటి వారికి ఎవరూ లొంగిపోకూడదని.. ప్రతిభను నమ్ముకుంటే కచ్చితంగా అవకాశాలు వస్తాయని దివ్యాంక స్పష్టం చేసింది. అవకాశం పేరుతో లైంగిక బెదిరింపులకు పాల్పడే వారిపై ప్రత్యేకంగా చట్టాలు తీసుకవచ్చి, చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పరిశ్రమలో మార్పులు వస్తాయని పేర్కొంది.
అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కామన్ అనే వ్యక్తులంతా తగ్గిపోతారని పేర్కొంది. ప్రస్తుతం దివ్యాంక చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. దివ్యాంగ ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉన్నది. అవకాశం వచ్చిన సందర్భాల్లో సినిమాలతో పాటు వెబ్సిరీస్లలోనూ నటిస్తున్నది. ప్రస్తుతం దివ్యాంక ‘అదృశ్యం’ సీరియల్లో నటిస్తున్నది. సీరియల్ నటుల్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా దివ్యాంక త్రిపాఠిక పేరున్నది.