చనిపోయే ముందు రాత్రి దిశా చిందులు.. వీడియో వైరల్‌

By Aithagoni RajuFirst Published Aug 8, 2020, 7:10 PM IST
Highlights

తాజాగా దిశ తన స్నేహితులతో కలిసి పార్టీలో సంతోషంగా డాన్స్‌ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా చిందులు వేశారు. 

రియా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే. జూన్‌ తొమ్మిది రాత్రి, ముంబైలోని మ‌లాద్ ప్రాంతంలోని ప్రియుడు రోహాన్ నివాసం ఉందని, దిశ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో పాటు‌‌, మ‌రికొంత‌మంది స్నేహితు‌లతో క‌లిసి పార్టీ చేసుకుందని, మ‌ద్యం ఎక్కువ‌గా తాగిన ఆమె ఏడుస్తూ తనని ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతూ ఆత్మహత్యకి పాల్పడిందనే విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే సుశాంత్‌, దిశ ఆత్మహత్యకు పాల్పడటంతో వీరిద్దరి మృతికి ఏదైన సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

తాజాగా దిశ తన స్నేహితులతో కలిసి పార్టీలో సంతోషంగా డాన్స్‌ చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో దిశ తన స్నేహితులతో ఓ హిందీ సినిమా పాటకు సరదాగా చిందులు వేశారు. ఇందులో దాదాపు ఏడుగురు ఉన్నారు. వీరిలో దిశతోపాటు మరో ముగ్గురు డాన్స్ చేస్తుండగా, ముగ్గురు సోఫాలో కూర్చొని సాంగ్‌ని తిలకిస్తున్నారు. 

Latest Videos

ఇంత జాలీగా గడిపిన దిశా నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిశా సలియన్‌ మృతి కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూ.. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం, ఆధారాలు తెలిసినా తమకు ఆ వివరాలు అందించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై దిశా స‌లియాన్ స్నేహితురాలు ఒకరు ఇటీవల స్పందిస్తూ, జూన్‌ తొమ్మిది రాత్రి, ముంబైలోని మ‌లాద్ ప్రాంతంలోని ప్రియుడు రోహాన్ నివాసం ఉందని, దిశ త‌న బాయ్‌ఫ్రెండ్‌తో పాటు‌‌, మ‌రికొంత‌మంది స్నేహితు‌లతో క‌లిసి పార్టీ చేసుకుందని, మ‌ద్యం ఎక్కువ‌గా తాగిన ఆమె ఒక్క‌సారిగా ఏడుస్తూ వాగిందని తెలిపింది. 

దీంతో అక్క‌డ ఉన్న‌ ఓ స్నేహితుడు పార్టీ నాశ‌నం చేయొద్ద‌ని చెప్పడంతో ఆమె త‌న‌ బెడ్‌రూంలోకి వెళ్లి గ‌డియ పెట్టుకుందని, ఎంత‌సేప‌టికీ తిరిగి రాక‌పోవ‌డంతో ఆమె
ప్రియుడు, ఇత‌ర మిత్రులు వెళ్లి త‌లుపు త‌ట్టారు. రూమ్‌లో లేకపోవడంతో బయట చూడగా, ఆమె బాల్క‌నీలో నుంచి దూకి మెట్ల‌పై ప‌డిపోయి క‌నిపించిందని, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిందని తెలిపింది. ఇలా ఓ వైపు సుశాంత్‌ కేసు, మరోవైపు దిశా కేసులు రోజుకో మలుపు తీసుకుంటూ ఉత్కంఠతకు గురి చేస్తున్నాయి. 

click me!