ప్రస్తుతం ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల షూటింగ్ కొనసాగుతూ ఉంది. ఇటీవలే విడుదలైన రాధే శ్యామ్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ప్రభాస్ నటిస్తున్న తొలి పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చివరి దశలో ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీపికా పదుకొనె, ప్రభాస్లాంటి బిగ్ బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రంలోకి హాట్ మెరుపుతీగ దిశా పటాని కూడా జాయిన్ అయింది.
దిశా పటానికి అప్పుడే ప్రభాస్ నుంచి సర్ ప్రైజ్ లు షురూ అయ్యాయి. తన సినిమాల్లో నటించే స్టార్స్ కి ప్రభాస్ తెలుగు వంటలతో డిన్నర్ ఇస్తుంటాడు. తాజాగా దిశా పటానికి ప్రభాస్ పసందైన విందు ఏర్పాటు చేశాడు. నోరూరించే వంటకాలు ఉన్న బాక్సుల్ని ప్రభాస్ దిశా పటాని కోసం పంపాడు. ఆ పిక్ ని దిశా పాటని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫన్నీ కామెంట్ పెట్టింది.
ప్రభాస్ మమ్మల్ని చెడగొడుతున్నాడు అంటూ కామెంట్ పెట్టింది. దిశా పటాని పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఆమె తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే.