ఆ డైరెక్టర్ తో చిరంజీవి... వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్!

By Sambi ReddyFirst Published Apr 15, 2024, 5:19 PM IST
Highlights


చిరంజీవి లేటెస్ట్ క్లిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు ఫోటో అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అదేమిటో చూద్దాం... 
 

చిరంజీవికి గత ఏడాది మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చిరంజీవి సంక్రాంతి విన్నర్ అయ్యాడు. దర్శకుడు బాబీ తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ కీలక రోల్ చేశాడు. చిరంజీవి-రవితేజ అన్నదమ్మలుగా కనిపించారు. అయితే భోళా శంకర్ రూపంలో ఆయనకు భారీ షాక్ తగిలింది. దర్శకుడు మహేష్ రమేష్ తెరకెక్కించిన ఈ చిత్రం నిరాశపరిచింది. 

భోళా శంకర్ తమిళ హిట్ మూవీ వేదాళం కి అధికారిక రీమేక్. భోళా శంకర్ పై ఫ్యాన్స్ లో మొదటి నుండి భయాలు ఉన్నాయి. దానికి కారణం దర్శకుడు. భారీ డిజాస్టర్స్ తో డైరెక్షన్ కి దూరమైన మెహర్ రమేష్ కి చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. ఆయన మెగా ఫోన్ పట్టి చాలా ఏళ్ళు అవుతుంది. అసలు ఫార్మ్ లో లేని దర్శకుడికి అవకాశం ఎలా ఇచ్చాడని ఫ్యాన్స్ వాపోయారు. వాళ్ళ ఆందోళన నిజం చేస్తూ భోళా శంకర్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. 

చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా భోళా శంకర్ నిలిచింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు రీమేక్స్ ఎందుకు చేస్తున్నారు. దయచేసి రీమేక్స్ చేయడం ఆపేయండి. అలాగే మెహర్ రమేష్ వంటి దర్శకులకు అవకాశం ఇవ్వొద్దని చిరంజీవికి సలహాలు ఇచ్చారు. భోళా శంకర్ రిజల్ట్ దెబ్బకు చిరంజీవి మలయాళ రీమేక్ బ్రో డాడీ చేయడానికి సిద్దమై వెనక్కి తగ్గారు. 

సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన ప్రాజెక్ట్ ని చిరంజీవి ఆపేశాడు. భోళా శంకర్ ఆ స్థాయిలో చిరంజీవి మీద, ఆయన అభిమానుల మీద ప్రభావం చూపింది. ఈ క్రమంలో విశ్వంభర మూవీ సెట్స్ లో చిరంజీవిని మెహర్ రమేష్ కలిశాడు. ఈ ఫోటోలు మెహర్ రమేష్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దానితో చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ షురూ చేశారు. ఆయనతో మరో మూవీ వద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతలా చిరంజీవి ప్ ఫ్యాన్స్ ని మెహర్ రమేష్ భయపెట్టాడు... 
 

click me!