దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

Published : Nov 28, 2021, 08:45 AM IST
దర్శకుడు శ్రీనువైట్ల ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత

సారాంశం

టాలీవుడ్‌ డైరెక్టర్‌ శ్రీనువైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు అనారోగ్యంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. దీంతో శ్రీనువైట్ల ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది.

ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు శ్రీనువైట్ల(Srinu Vaitla ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి వైట్ల కృష్ణారావు(83) ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా, కందులపాలెంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో Director Srinu Vaitla కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి ఫ్యామిలీ తీవ్ర దిగ్ర్భాంతికి గురవుతుంది. కృష్ణారావుకి కుమారుడు, దర్శకుడు శ్రీనువైట్లతోపాటు ఒక కుమార్తె ఉన్నారు. 

శ్రీనువైట్ల తండ్రి మరణించాడనే వార్తతో సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. దర్శకుడికి ఫోన్‌ చేసి తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణారావు ఆత్మకి శాంతిచేకూరాలని, శ్రీనువైట్ల ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనువైట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చివరగా మూడేళ్ల క్రితం రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పరాజయం చెంది. 

ఇటీవల కెరీర్‌ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా దర్శకుడు శ్రీనువైట్ల 1999లో రవితేజ హీరోగా `నీకోసం` సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `ఆనందం`, `సొంతం`, `ఆనందమానందమాయే` చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. రవితేజతో చేసిన మరో `వెంకీ`తో బ్లాక్‌ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకుని టాప్‌ డైరెక్టర్‌లో ఒకరిగా మారిపోయారు. చిరంజీవితో `అందరి వాడు`, మంచు విష్ణుతో `ఢీ`, రవితేజతో `దుబాయ్‌ శీను`, `రెడీ`, `కింగ్‌`, `నమో వెంకటేశాయా`, `దూకుడు`, `బాద్‌షా`, `ఆగడు`, `బ్రూస్‌లీ`, `మిస్టర్` చిత్రాలకు దర్శకత్వం వహించారు. `దూకుడు` ఆయన కెరీర్‌లో అతిపెద్ద బ్లాక్‌ బస్టర్‌గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మంచు విష్ణుతో `ఢీ` సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు