బర్త్ డే సందర్భంగా ఫాంహౌజ్‌లో మొక్కలు నాటిన దర్శకుడు సంపత్‌ నంది..

Published : Jun 20, 2022, 07:16 PM IST
బర్త్ డే సందర్భంగా ఫాంహౌజ్‌లో మొక్కలు నాటిన దర్శకుడు సంపత్‌ నంది..

సారాంశం

ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం తన ఫాంహౌజ్‌లో మొక్కలు నాటారు. 

ఇటీవల `సీటీమార్‌`తో విజయాన్ని అందుకున్న సంపత్‌ నంది గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. నేడు(జూన్‌ 20)న పుట్టిన రోజు సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. బర్త్ డే సందర్భంగా కడ్తాల్‌లోని తన ఫాంహౌజ్‌లో ఆయన మొక్కలు నాటారు. తాను నిర్మిస్తున్న `సింబా` చిత్ర యూనిట్‌ సైతం ఇందులో పాల్గొంది. వీరంతా కలిసి వంద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో, ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

దర్శకుడు సంపత్‌ నంది తన బర్త్ డే సందర్భంగా తన టీమ్‌తో కలిసి మొక్కలు నాటడం పట్ల రాజ్యసభ సభ్యులు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమ అధినేత జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు సినీ డైరెక్టర్ సంపత్ నంది గ్రీన్ ఇండియా చాలెంజ్  స్ఫూర్తితో తన జన్మదినం సందర్భంగా 'సింబా' చిత్ర యూనిట్ తో కలిసి మొక్కలను నాటడం ఆనందంగా ఉందన్నారు. `సింబా`కూడా ఫారెస్ట్ ఆఫీసర్ నేపథ్యంతో ప్రకృతికి దగ్గరగా  నిర్మిస్తుండటం గొప్ప విషయమన్నారు. 'సింబా' చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని ఎంపీ సంతోష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

గోపీచంద్‌ హీరోగా రూపొందించిన `సీటీమార్‌` గతేడాది విడుదల విజయాన్ని అందుకుంది. అటు సంపత్‌ నందికి, ఇటు గోపీచంద్‌కి మంచి సక్సెస్‌ని ఇచ్చింది. ప్రస్తుతం ఆయన తన ప్రొడక్షన్‌లో మూడు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో ఒకటి `సింబా`. ఈ చిత్రాన్ని రాజేందర్ రెడ్డితో కలిసి దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్నారు. మురళీమనోహర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అటవీ సంరక్షణ ఆవశ్యకతను చాటిచెబుతూ సందేశాత్మకంగా కథాంశంతో సింబా రూపొందుతోంది. ఇందులో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. అనసూయ కీలక పాత్రధారి. దీనికి సంపత్‌ నందినే కథ అందిస్తున్నారు. వీటితోపాటు `ఓడెల రైల్వే స్టేషన్‌`, `బ్యాక్‌ రోజ్‌` చిత్రాలకు కథ అందిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?