ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకి వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్ కరోనాతో కన్నుమూశారు. వర్మ వద్ద సోమశేఖర్ పలు సినిమాలకు పనిచేశారు.
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకి వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్ కరోనాతో కన్నుమూశారు. వర్మ వద్ద సోమశేఖర్ పలు సినిమాలకు పనిచేశారు. ఆర్జీవీ రూపొందించిన `రంగీలా`, `దౌడ్`, `సత్య`, `జంగిల్`, `కంపెనీ` సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించాడు. హిందీలో `ముస్కురాకే దేఖ్ జరా` చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. సోమశేఖర్ సినిమాల నుంచి ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో వర్మకి దూరంగా ఉంటున్నారు.
అయితే తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో సోమశేఖర్ ఒకరని, అతడిని చాలా మిస్ అవుతున్నానని ఆర్జీవి చాలా సందర్భాల్లో తెలిపారు. `సత్య` షూటింగ్ సమయంలో ఆర్జీవి కంటే శేఖర్ని చూస్తే ఎక్కువ భయం వేసేదని హీరో జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాజాగా బోనీ కపూర్.. సోమశేఖర్ మృతిపై స్పందించారు. `ఆయన తల్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని, కరోనా సోకిన తర్వాత కూడా తల్లి కోసం ఎంతో పరితపించేవాడు. తన తల్లిని కాపాడగలిగాడు గానీ, తన ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు` అని తెలిపారు.