ప్రస్తుతం డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ ని సెట్ చేసినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు తొలిప్రేమ, రంగ్ దే సినిమాల ఫేమ్ వెంకీ అట్లూరి కావటం విశేషం. ఈ యువ దర్శకుడు డైరక్ట్ చేసిన సినిమాలు చూసిన పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సమర్పించే ఈ సినిమా హారికా,హాసిని క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. పవన్ పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంభందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.
ప్రస్తుతం లాయిర్ సాబ్ రీమేక్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో రీమేక్ చేయటానికి ఉత్సాహం చూపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ ప్రాజెక్టుకు డైరక్టర్ ని సెట్ చేసినట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు తొలిప్రేమ, రంగ్ దే సినిమాల ఫేమ్ వెంకీ అట్లూరి కావటం విశేషం. ఈ యువ దర్శకుడు డైరక్ట్ చేసిన సినిమాలు చూసిన పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సమర్పించే ఈ సినిమా హారికా,హాసిని క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. పవన్ పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబర్ 2న ఈ సినిమాకు సంభందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.
ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి ..లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఎప్పుడైతే పవన్ సీన్ లోకి వచ్చారో అప్పుడే మొత్తం మారిపోయాయి. సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారు. వచ్చే సంవత్సరం ప్రారంబంలో ఈ సినిమా షూట్ ప్రారంభం అవుతుంది. దర్శకుడు సాగర్ చంద్ర... ఈ సినిమా స్క్రిప్టు ఓ వెర్షన్ రాసినట్లు సమాచారం.
సచీ దర్శకత్వంలో రూపొందిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` మలయాళంలో సంచలన విజయం సాధించింది. ఇందులో పృథ్వీరాజ్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ హీరోగా నటించాడు. ఈ చిత్ర రీమేక్ రైట్స్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవరనాగవంశీ దక్కించుకున్నారు.
మరో ప్రక్క ..సితార ఎంటర్టైన్మెంట్స్ ఇటీవలే నితిన్ నటించిన భీష్మ తో పెద్ద హిట్ అందుకుంది. అంతేకాకుండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం నితిన్ ,కీర్తి సురేష్లతో రంగ్దే, నానితో శ్యామ్ సింగరాయ్. నాగశౌర్యతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంగ్దే , శ్యామ్ సింగరాయ్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.