`వారసుడు` కలగూరగంప.. దిల్‌రాజు ఏమన్నాడంటే.. ఆ విషయం ముందే తెలుసా!

Published : Jan 09, 2023, 11:39 AM ISTUpdated : Jan 09, 2023, 12:08 PM IST
`వారసుడు` కలగూరగంప.. దిల్‌రాజు ఏమన్నాడంటే.. ఆ విషయం ముందే తెలుసా!

సారాంశం

`వారసుడు` ట్రైలర్‌ చూశాక ఇది తెలుగులో వచ్చిన `అజ్ఞాతవాసి`, `బ్రహ్మోత్సవం`, `అలా వైకుంఠపురములో` వంటి సినిమాలను పోలి ఉందనే కామెంట్లపై దిల్‌రాజు బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

నిర్మాత దిల్‌రాజు నిర్మించిన `వారసుడు` చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నెల 11న విడుదల కావాల్సిన ఈ చిత్రం జనవరి 14కి వాయిదా వేశారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కోసం వాయిదా వేసినట్టు చెప్పిన విషయం తెలిసిందే. తన సినిమాపై నమ్మకంతా వెనక్కి తగ్గినట్టు చెప్పారు. గతంలో తాను చేసిన `సీతామ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `శతమానం భవతి` వంటి చిత్రాలు సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్‌ అయ్యాయని, ఇప్పుడు `వారసుడు` కూడా అలానే హిట్‌ అవుతుందని, ఆడియెన్స్‌ ఆదరణ పొందుతుందని నమ్ముతున్నట్టు చెప్పారు. 

ఈ సందర్భంగా మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `వారసుడు` ట్రైలర్‌ చూశాక ఇది తెలుగులో వచ్చిన `అజ్ఞాతవాసి`, `బ్రహ్మోత్సవం`, `అలా వైకుంఠపురములో` వంటి సినిమాలను పోలి ఉందని, అవన్నీ మిక్స్ చేసిన మిక్చర్‌ పొట్లంలా ఉందనే ప్రశ్న దిల్‌రాజు కి ఎదురయ్యింది. దీనిపై దిల్‌రాజు స్పందించారు. ఇలా ఉందనే విషయం తనకు కథ విన్నప్పుడే కలిగిందట. అన్నీ తెలిసే తాను ఈ సినిమా చేశానని తెలిపారు దిల్‌రాజు. 

అయితే ఈ సినిమా ద్వారా ఓ కొత్త పాయింట్‌ని చెప్పబోతున్నామన్నారు. అది సర్ప్రైజింగ్‌గా ఉంటుందన్నారు. అంతేకాదు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఫైట్స్, సెంటిమెంట్‌, హీరోయిజం ఇలా అన్ని మేళవింపుగా ఉంటుందని, చూస్తున్నంత సేపు ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఎమోషన్‌ క్యారీ అవుతుందని, ఎక్కడ బోర్‌ ఫీలింగ్ ఉండదన్నారు. సినిమా చూస్తున్నంత సేపు రెండున్నర గంటలు ఆడియెన్స్ ని ఎంగేజ్‌ చేసిందా లేదా అనేది ముఖ్యమని ఆ అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయన్నారు. 

తెలుగులో నిర్మించకపోవడంపై దిల్‌రాజు స్పందిస్తూ, మొదట తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌ గా చేయాలని అనుకున్నామని, కానీ విజయ్‌ తమిళంలోనే చేయండి అని చెప్పడంతో వెనక్కి తగ్గామని తెలిపారు. డబ్బింగ్‌ సినిమాలైనా కథ బాగుంటే ఆదరణ పొందుతాయన్నారు దిల్‌రాజు. ఫిబ్రవరిలోనూ `శాకుంతలం`తోపాటు ఇతర సినిమాలో పోటీపడుతున్నాయనే ప్రశ్నకి, ఆ రోజు కూడా మాట్లాడుకుని సెట్‌ చేసుకుంటామన్నారు. దీంతోపాటు ట్రైలర్లు చూసి బిజినెస్‌ జరిగే రోజులు పోయాయని తెలిపారు దిల్‌రాజు. హీరోల క్రేజ్‌మీదనే సినిమా వ్యాపారం జరుగుతుందన్నారు. 

వంశీపైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ హీరోగా రూపొందిన `వారసుడు` చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈసినిమా తమిళంలో ఈ నెల 11నే విడుదల కానుంది. తెలుగులో మాత్రం 14కి వాయిదా పడింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?