ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ కలుస్తారు.. విడాకులపై తండ్రి కస్తూరి రాజా ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

By Aithagoni RajuFirst Published Jan 19, 2022, 10:38 PM IST
Highlights

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, రజనీకాంత్‌ తనయ ఐశ్వర్య విడిపోతున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఊహించిన విధంగా వీరి నుంచి విడాకుల ప్రస్తావన రావడంతో అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. 

`అందరు భార్యభర్తల మధ్య జరిగే గొడవలే ధనుష్‌(Dhanush), ఐశ్వర్య(Aishwaryaa)ల మధ్య చోటు చేసుకున్నాయని, అవి త్వరలోనే సమరిపోయి, వారిద్దరు మళ్లీ ఒక్కటవుతారని ఆశిస్తున్నానని ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా అన్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, రజనీకాంత్‌ తనయ ఐశ్వర్య విడిపోతున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. 18ఏళ్లు కలిసి తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించిన Dhanush, ఐశ్వర్య తాము విడిపోతున్నామని సోమవారం రాత్రి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఊహించిన విధంగా వీరి నుంచి విడాకుల ప్రస్తావన రావడంతో అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు. సినీ వర్గాలు సైతం వీరి డైవర్స్ పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి డైవర్స్ పై ధనుష్‌ తండ్రి కస్తూరి రాజాస్పందించారు. ఆయన మీడియాతో ముచ్చటిస్తూ, `భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. ధనుష్‌,ఐశ్వర్యల మధ్య కూడా అలాంటి గొడవలే చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఫోన్‌లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు అందించాను. రజినీకాంత్(Rajinikanth) కూడా విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని వారిద్దరిని కోరారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలెబ్రిటీలు పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం`  అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా పేర్కొన్నారు. మరి రజనీ, కస్తూరి రాజాల రిక్వెస్ట్ లను ధనుష్‌, ఐశ్వర్య పరిశీలిస్తారా? తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? లేదు అలానే ముందుకు సాగుతారా అనేది వేచి చూడాలి.

2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం  జరిగింది. అప్పటికి ధనుష్‌ వయసు  21ఏళ్లు మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. ప్రేమకి వయసుతో సంబంధం లేదని నిరూపించుకున్నారు. ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ప్రేమకి గుర్తుగా ఇద్దరు కుమారులు యాత్ర రాజా, లింగ రాజా జన్మించారు. ప్రస్తుతం యాత్ర రాజా వయసు 15 సంవత్సరాలు కాగా, లింగ రాజా వయసు 11 సంవత్సరాలు. ఇలాంటి  టైమ్‌లో వీరిద్దరు డైవర్స్ ప్రకటించడం షాక్‌కి గురి చేస్తుంది. 

ధనుష్‌..  ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `సార్‌` అనే  సినిమాలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ధనుష్‌. ఇవే కాకుండా ఆయన `మారన్‌`, `థిరుచిత్రంబలం`, `నాన వరువెన్‌`,  `వాతి` చిత్రాల్లో నటిస్తున్నారు.  దీంతోపాటు `ది గ్రే మ్యాన్‌` అనే హాలీవుడ్‌ చిత్రం  చేస్తున్నారు. అన్నట్టు ధనుష్‌ తండ్రి కస్తూరి రాజా కోలీవుడ్‌లో పెద్ద డైరెక్టర్ అనే విషయం తెలిసిందే.

click me!